నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్తే ముద్దు
మూడు దశాబ్దాల కాలంగా చాపకింద నీరులా విస్తరిస్తూ, ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఎయిడ్స్పై ఎప్పటికప్పుడు పైచేయి సాధించాలనుకున్న మానవాళికి అనుకున్న స్థాయిలో సాధ్యం కావడంలేదు.
నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం
ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ
నక్కపల్లి, న్యూస్టుడే: మూడు దశాబ్దాల కాలంగా చాపకింద నీరులా విస్తరిస్తూ, ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఎయిడ్స్పై ఎప్పటికప్పుడు పైచేయి సాధించాలనుకున్న మానవాళికి అనుకున్న స్థాయిలో సాధ్యం కావడంలేదు. లైంగిక సంబంధాల విషయంలో పెడదారి పడుతుండటంతో చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ఈ మహమ్మారికి చిక్కుతున్నారు. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
అక్రమ/అసహజ లైంగిక కలయికలు, వ్యాధి సోకిన వారి రక్తం దురదృష్టవశాత్తు మరొకరికి ఎక్కించడం వంటి కారణాలతో ఎయిడ్స్ వస్తుంది. దీనిపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు జనాల్లో మార్పుకోసం కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలనూ చేపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 190 దేశాలు ఈ వ్యాధిపై సామూహికంగా పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో మన వద్ద తీసుకువచ్చిన మార్పులు, అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా కాస్తో, కూస్తో సత్ఫలితాలు వస్తున్నాయి. గతంలో గర్భిణికి వ్యాధి ఉంటే.. పుట్టే బిడ్డా దీనిబారిన పడేది. ప్రస్తుతం వ్యాధి ఉన్నట్లు ఆదిలోనే గుర్తిస్తే డీఎల్టీ మందుల వాడకం ద్వారా శిశువును రక్షించగలుగుతున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో ఐసీటీసీ రక్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వ్యాధి సోకినవారికి అవసరమైన మందులు ఉచితంగా అందిస్తున్నారు. అదేవిధంగా వీరికి ప్రభుత్వం పింఛన్ సదుపాయం కల్పించింది. దీనికి తోడు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలతోపాటు సంచార రక్తపరీక్షల కేంద్రాన్ని పల్లెల్లోకి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఈ ఏడాది సమానత్వం ద్వారా అసమానతలను అంతం చేయడానికి ఏమవుదాం అనే నినాదాన్ని ప్రచారం చేశారు.
గ్రామాల్లో మొబైల్ రక్తపరీక్ష కేంద్రం ద్వారా తనిఖీలు
ఆశాజనకంగా కేసుల తగ్గుదల
ఏటేటా చేపడుతున్న చర్యల కారణంగా కేసుల తగ్గుదల ఆశాజనకంగా ఉండటం జిల్లా అధికార యంత్రాంగానికి ఊరటనిస్తోంది. గతేడాది జిల్లాలో 30,235 మంది సాధారణ వ్యక్తులకు పరీక్షలు చేస్తే 418, ఈ ఏడాది అక్టోబరు 22 నాటికి 25,833 మందికి పరీక్ష చేస్తే, 254 ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. తద్వారా 1.38 శాతం నుంచి 0.98శాతం దిగువకు కేసులు వచ్చాయి. అదేవిధంగా గతేడాది 24,760 మంది గర్భిణులను పరీక్షించగా 31, ఈ ఏడాది 17,963కి పరీక్ష చేస్తే కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
* ఉమ్మడి విశాఖ జిల్లాలో గడిచిన అయిదేళ్లలో గర్భిణుల్లో 1 శాతం వ్యాధిగ్రస్థులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
* అయిదేళ్ల కాలంలో సాధారణ వ్యక్తుల్లో ఇది 2.2 శాతం నుంచి 1.01 శాతానికి వచ్చింది.
* అదే విధంగా రాష్ట్రంలో మన జిల్లా గతేడాదిలానే ఆరో స్థానంలో ఉంది.
వారిపై వివక్ష చూపొద్దు
- డాక్టర్ ఎ.హేమంత్, డీఎంహెచ్ఓ
ఎయిడ్స్పై బిడియం వదిలి అంతా బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అనుమానం ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి సోకిన వారికి మందులు, కౌన్సెలింగ్ ద్వారా జీవిత కాలం పెంచేలా చూస్తున్నాం. యువతలో దీనిపై చైతన్యం పెంపొందించేలా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యాధి సోకిన తర్వాత విచారించడంకంటే దీని బారినపడకుండా చూసుకోవడం మేలు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు. వ్యాధి సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు. ఈ ఏడాది నినాదం ఇదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు