logo

బండరాయితో మోది దారుణ హత్య

పేట పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Published : 03 Dec 2022 00:58 IST

చినఅప్పారావు మృతదేహం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పేట పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గా కాలనీకి చెందిన చిరుకూరి చిన అప్పారావు (47) గురువారం రాత్రి నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోదీ హతమార్చారు. ఈ నెల ఒకటో తేదీన కుమార్తె శ్రీదేవి ఇంటికి వచ్చిన అప్పారావు మేనల్లుడు రమేష్‌ గంజాయి కేసులో అరెస్టు అయ్యాడని తెలిసి ఆగ్రహంతో కేకలు వేశాడు. కొంతమంది కావాలనే కేసులో ఇరికించారని మండిపడ్డాడు. రాత్రి 11 గంటల సమయంలో భోజనం చేసి సోదరికి చెందిన కొట్టు గదిలో నిద్రించాడు. శుక్రవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో కుక్కలు అరవడం గమనించిన శ్రీదేవి భర్త రవికుమార్‌ కొట్టు గది వద్దకు వచ్చి చూడగా.. రక్తం మడుగులో అప్పారావు కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, సీఐ అప్పలరాజు, ఎస్సై రమేష్‌ అక్కడకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. మృతదేహాన్ని నక్కపల్లి ఆసుపత్రిలోని శవాగారానికి తరలించారు. హత్యకు గంజాయి కేసు వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని