logo

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సత్యసాయి తాగునీటి పథకం సిబ్బందికి పది నెలలుగా జీతాలు చెల్లించకపోవడం తగదని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లాల రాజ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 03 Dec 2022 00:58 IST

కార్మికులకు సంఘీభావం తెలుపుతున్న తెదేపా నాయకులు

మారేడుమిల్లి, రంపచోడవరం, న్యూస్‌టుడే: సత్యసాయి తాగునీటి పథకం సిబ్బందికి పది నెలలుగా జీతాలు చెల్లించకపోవడం తగదని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లాల రాజ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా రిలేదీక్షలు చేస్తున్న కార్మికులకు శుక్రవారం మారేడుమిల్లి మండల తెదేపా ఆద్వర్యంలో సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ మన్యంలో తాగునీటి పథకాల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మండల తెదేపా అధ్యక్షుడు గురుకు శేషుకుమార్‌, నాయకులు పొడియం శీనుబాబు, పల్లాల భూపతిరెడ్డి, పండల జనార్దన్‌రెడ్డి, మడకం వెంకటేశ్‌, కత్తుల రత్నారెడ్డి, రాజు, కుంజం ముత్తన్నదొర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని