logo

ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

పాడేరు మండలం డోకులూరు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొండలరావు (15) అనారోగ్యంతో స్వగ్రామం జి.మాడుగుల మండలం పి.మాడుగులలో శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు సమాచారం.

Published : 03 Dec 2022 00:58 IST

పాడేరు, జి.మాడుగుల, న్యూస్‌టుడే: పాడేరు మండలం డోకులూరు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొండలరావు (15) అనారోగ్యంతో స్వగ్రామం జి.మాడుగుల మండలం పి.మాడుగులలో శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు సమాచారం. ఈ విద్యార్థి అనారోగ్యం కారణంగా గతనెల 29న స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మరణించాడని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు అప్పలనర్స పేర్కొన్నారు. గతనెల రోజుల్లో వివిధ కారణాలతో వసతిగృహాల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆశ్రమ పాఠశాలల్లో వైద్యసేవలు మెరుగుపరచాలని డిమాండు చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో విద్యార్థి మృతి సమాచారం అధికారులకు చేరడం ఆలస్యమైంది.. దీనిపై గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని విదార్థి స్వగ్రామానికి వెళ్లమని చెప్పామన్నారు. అక్కడ నుంచి సమాచారం వస్తే విద్యార్థి మృతిని ధ్రువీకరించగలమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని