ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాలో అనర్హులు?
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి (ఎమ్మెల్సీ) ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
విశాఖపట్నం, న్యూస్టుడే
కలెక్టరేట్లోని ఎమ్మెల్సీ ఎన్నికల సలహా కేంద్రం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి (ఎమ్మెల్సీ) ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. 2019 తర్వాత డిగ్రీ ఉతీర్ణులైన వారు సైతం ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సీపీఎం నేతలు ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కు ఫిర్యాదు చేశారు. మరో పక్క ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇదే సమయంలో పేర్లు నమోదు చేసుకోకుండా ఉండిపోయిన అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంది.
క్షేత్రస్థాయిలు చురుగ్గా పరిశీలన
* 2019కు ముందు డిగ్రీ ఉతీర్ణులైన వారు మాత్రమే ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుకు జత చేసిన డిగ్రీ ధ్రువపత్రాలపై గజిటెడ్ అధికారి సంతకం చేసిన వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయినప్పటికీ నిర్దేశిత నిబంధన ఉల్లంఘించారని, 2019 తర్వాత డిగ్రీ ఉతీర్ణులైన వారి పేర్లను సైతం ఓటరు జాబితాలో చేర్చారని ఫిర్యాదులు వచ్చాయి.
* ఉత్తరాంధ్ర పరిధిలో ఆరు జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఓటరు జాబితాల తయారీ కోసం నియమితులైన ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి), ఏఈఆర్ఓల (అదనపు ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి) ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వారీ ఓటరు జాబితాల పరిశీలన చేపట్టారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించిందీ లేనిదీ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా ఓటర్లపై అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. డబుల్ ఎంట్రీలను తొలగిస్తున్నారు. అభ్యంతరాలపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తప్పిదాలు ఉంటే ఆయా పేర్లను తొలగిస్తున్నారు.
పునః నమోదుకు 11వేల దరఖాస్తులు
* ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఉత్తరాంధ్రలో 2,43,903 మంది పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మళ్లీ పేర్ల నమోదుకు ఇంత వరకు 11వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటి విచారణ కూడా చేపట్టారు.
* అభ్యంతరాలతో పాటు సుమోటోగా కూడా ముసాయిదా ఓటరు జాబితాలపై విచారణ చేస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. తమ దృష్టికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక వేళ జాబితాల్లో ఎక్కడైనా తప్పిదాలు ఉంటే అభ్యంతరం తెలుపుతూ పౌరులు దరఖాస్తు చేయవచ్చునని సూచించారు. ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా జాబితాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?