గుప్పుగుప్పు ఎక్కువే.. చిక్కేది తక్కువే!!
దేశంలో ఎక్కడ గంజాయి వంటి మత్తుపదార్థాలు చిక్కినా దాని మూలాలు అల్లూరి సీతారామరాజులో ఉండటం పరిపాటిగా మారింది. ‘డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ’ (డి.ఆర్.ఐ.) వార్షిక నివేదికలో ఇది వెల్లడైంది.
పాడేరు, చింతపల్లి, చింతూరు, న్యూస్టుడే
దేశంలో ఎక్కడ గంజాయి వంటి మత్తుపదార్థాలు చిక్కినా దాని మూలాలు అల్లూరి సీతారామరాజులో ఉండటం పరిపాటిగా మారింది. ‘డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ’ (డి.ఆర్.ఐ.) వార్షిక నివేదికలో ఇది వెల్లడైంది. దేశవ్యాప్తంగా గంజాయి స్మగ్లింగ్కు సంబంధించిన వివరాలను, మాదకద్రవ్యాలు, నేరాలపై ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తయారుచేసిన నివేదిక వివరాలను పొందుపరచారు. మన్యంలో 20 వేల ఎకరాలకు పైగా గంజాయి సాగవుతోందని, కోట్లాది రూపాయలు అక్రమ వ్యాపారం సాగుతోందని సమాచారం. ఈ దందా వెనుక కొన్ని చోట్ల పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది హస్తం పరోక్షంగా ఉన్నట్లు కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది.
గత ఏడాది తెలంగాణా రాష్ట్రానికి చెందిన పోలీసులు పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన నిందితులను పట్టుకునేందుకు చింతపల్లి అటవీ ప్రాంతానికి వచ్చారు. నిందితులను వారి వెంట తీసుకువెళుతున్న సమయంలో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పర దాడులకు దిగడంతో ఇద్దరు గిరిజనులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం అప్పట్లో గంజాయి మూలాలు ఏజెన్సీలో ఎంతగా నాటుకున్నాయో బయటకొచ్చింది. దీనిపై తెదేపాతో పాటు వివిధ రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి.
అల్లూరి జిల్లాలో గంజాయి తోటలు
విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చింది. ఏజెన్సీలో ఒక్క మొక్క కూడా పండటం లేదని చెబుతూ వస్తోన్న పోలీసులు తప్పనిసరై గంజాయి తోటలపై దాడులకు దిగారు.
పోలీసులు, ఎక్సైజ్, అటవీ శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గత ఏడాది చేపట్టిన దాడుల్లో సుమారు 14 వేల ఎకరాల తోటలను ధ్వంసం చేశారు. నిఘా వర్గాలకు చిక్కని తోటలు మరో ఆరు వేల ఎకరాల్లో ఉండొచ్చని అంచనా వేశారు.
స్థానికంగా కేజీ రూ.5 వేల వరకు ఉన్న గంజాయి చెన్నై, ముంబయి, హైదరాబాద్ ప్రాంతాల్లో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోందని కొన్ని నిఘా వర్గాలే చెబుతున్నాయి. దీంతో గడిచిన మూడేళ్లుగా గంజాయి రవాణా పెద్దఎత్తున సాగుతోంది. అల్లూరి జిల్లా ఇటు ఒడిశా, ఛతీస్గఢ్ రాష్ట్రాలకు ఆనుకుని ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి గంజాయిని ఈ జిల్లా ప్రధాన ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకులోయ మీదుగా సులభంగా తరలిస్తున్నారు. అటువైపు చూస్తే చింతూరు, రంపచోడవరం ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. బైకులు, గుర్రాలు, పెట్రోల్ ట్యాంకర్లతో పాటు ఆఖరికి ఆర్టీసీ బస్సులను సైతం రవాణాకు వినియోగిస్తుండటం విశేషం.
వాహనంలో చిక్కిన గంజాయి ప్యాకెట్లు
మచ్చుకు కొన్ని..
* గూడెంకొత్తవీధి నుంచి పాడేరు వెళుతున్న డొంకరాయి బస్సును పోలీసులు తనిఖీ చేయగా మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి స్మగ్లర్లతో పాటు ఆర్టీసీ కండక్టర్పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
* ఇటీవల పెదబయలు ప్రాంతం నుంచి గంజాయితో వస్తున్న వాహనాన్ని పట్టుకునేందుకు ఎక్సైజ్ సిబ్బంది బయలుదేరారు. గబ్బంగి సమీపంలో ఎక్సైజ్ వాహనం ఎదురుగా వస్తోందని తెలుసుకున్న రవాణాదారులు ఆ వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ఢీకొట్టారు. తర్వాత కొంత దూరం వెళ్లి కొండవాలు వద్ద వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యారు.
* హుకుంపేట మండలం కామయ్యపేట వద్ద గంజాయితో వస్తున్న ముఠా ఆ ప్రాంతంలో వేరే పనిపై వెళుతున్న పోలీసు సిబ్బందిని చూసి తప్పించే క్రమంలో తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని వదిలి వెళ్లారు. భారీ గంజాయితో పాటు ఓ పిస్తోలు సైతం లభ్యమయ్యాయి.
ఆ మరక లేకుండా చేస్తున్నాం...
సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా
గతంలో పోల్చితే గంజాయిపై దాడులు విస్తృతంగా చేస్తున్నాం. గత ఏడాది భారీ స్థాయిలో దాడులు నిర్వహించి వేలాది ఎకరాలను ధ్వంసం చేశాం. రైతులకు ప్రత్యామ్నాయంగా రాజ్మా, ఇతర పంటలకు సంబంధించి ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా చింతూరు, సీలేరు ప్రాంతాల్లో రవాణా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో కొద్దొ గొప్పో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆయా ప్రాంతాలపైనా కూడా గురిపెట్టి దాడులు ఉద్ధృతం చేస్తాం. జిల్లాలో దాదాపుగా గంజాయి రవాణా తగ్గినట్లే భావిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్