మైమరపించే వసతులు సిద్ధం
ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల సందడి పెరిగింది. నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య వారాంతాల్లో భారీగా ఉంటోంది.
పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది
అందుబాటులోకి లంబసింగి రిసార్టు
ఏపీటీడీసీ డీవీఎం హరిత
అందుబాటులోకి వచ్చిన లంబసింగి రిసార్టు
ఈనాడు, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల సందడి పెరిగింది. నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య వారాంతాల్లో భారీగా ఉంటోంది. కొవిడ్ తరువాత పరిస్థితులు చక్కబడటంతో ప్రస్తుత సీజన్లో దేశ నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ నుంచి పర్యాటక ప్యాకేజీలను పెంపొందించడంతో అరకు, అనంతగిరి, టైడా, లంబసింగిలో సందర్శకులను మైమరపించే వసతులు సిద్ధం చేసినట్లు డివిజనల్ మేనేజర్ (డీవీఎం) హరిత పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నం డీవీఎంగా బాధ్యతలు చేపట్టిన హరిత...ఈ సీజన్ నిమిత్తం చేపట్టిన చర్యలను వివరించారు.
* ఒడిశా, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చే పర్యాటకులు అధికం. వీరిలోనూ బెంగాల్ నుంచి వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువ. ఇప్పటికే కోల్కతాలో ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం. దాని ద్వారా ప్యాకేజీలు అయ్యేలా చూస్తున్నాం. పర్యాటక హోటళ్లలో వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించాం.
* అసంపూర్తిగా ఉండిపోయిన లంబసింగి హిల్ రిసార్టును అందుబాటులోకి తీసుకొచ్చాం. పర్యాటకులకు నచ్చేలా అత్యాధునిక వసతులతో గదులు, రెస్టారెంట్ నిర్మాణం పూర్తయింది. గతంలో ఉన్న నాలుగు గదులతో పాటు కొత్తగా 8 గదుల అందుబాటులోకి వచ్చాయి. మరో మూడు కొద్ది రోజుల్లో పూర్తవుతాయి. ప్రకృతి
అందాలను, మంచు కురిసే సొబగులను గదుల్లో నుంచే వీక్షించేలా ఉన్న ఈ రిసార్టులు ఆకట్టుకుంటాయి. సూట్, డీలక్స్ సూట్, ఏసీ గదులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సీజన్లో పర్యాటకులకు గదుల కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ వసతి సదుపాయంగా టెంట్హౌస్లను సమకూర్చేలా ప్రణాళిక చేశాం. రిసార్టు సమీపంలో వాటిని ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. ప్రస్తుతానికి 30 వరకు సిద్ధంగా ఉంచాం. డిమాండు మేరకు పెంచుతాం.
* ఏపీటీడీసీకి విశాఖలో 1, టైడాలో 1, అనంతగిరి 1, అరకు 2, లంబసింగిలో ఒక రిసార్టు ఉన్నాయి. వీటన్నింటిలో 180 వరకు గదులున్నాయి. సందర్శకులను ఆకట్టుకునేలా ప్రస్తుత సీజన్కు వాటిని సిద్ధం చేశాం. ఎక్కడికక్కడ మరమ్మతులు పూర్తి చేశాం. ప్రస్తుతానికి వారాంతాల్లో గదుల కోసం డిమాండు ఉంది. సంక్రాంతి వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది.
* ఇప్పటికే చాలా గదులను సందర్శకులు బుక్ చేసుకున్నారు. ప్యాకేజీల నిర్వహణకు మినీ బస్సులు, ఇన్నోవాలను సిద్ధంగా ఉంచాం. డిమాండు ఆధారంగా వాటిని నడిపేలా ప్రణాళిక చేశాం. ప్యాకేజీలు, గదుల బుకింగ్ నిమిత్తం ‘టూరిజం ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్, 98488 13584, 88974 64333 నెంబర్లలో సంప్రదించొచ్చు.
* విశాఖ నుంచి తిరుపతి, శ్రీశైలం ప్యాకేజీల నిర్వహణకు ప్రతిపాదనలు చేశాం. ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చిన వెంటనే నడపాలనుకుంటున్నాం. కొత్తగా విశాఖ నుంచి రాయగడ మీదుగా కొరాపుట్ మార్గంలో ప్యాకేజీలపై కసరత్తు చేస్తున్నాం. ఈ మార్గంలో నడిచే రైలుకు అద్దాల బోగీ జత చేయడంతో సందర్శనీయ ప్రాంతాల ఆధారంగా ప్యాకేజీల రూపకల్పనపై ఆలోచన చేస్తున్నాం. రైల్వే అధికారులతో కలిసి ఇప్పటికే ఒకసారి రాయగడ-కొరాపుట్ మార్గంలో పర్యటించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్