జీతాలివ్వకపోతే ఎలా బతుకుతారు?
సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
కార్మికులకు ఆర్థికసాయం అందిస్తున్న ఎమ్మెల్సీ ఐవీ
రంపచోడవరం, న్యూస్టుడే: సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట కార్మికులు చేస్తున్న దీక్షలు సోమవారం 12వ రోజుకు చేరాయి. ఎమ్మెల్సీ దీక్షాశిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికుల అవసరాల నిమిత్తం రూ.6,350 ఆర్థికసాయం అందచేశారు. ఆయన మాట్లాడుతూ పది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే భార్య, పిల్లలతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. అనంతరం పీవో గనోరేను కలిసి వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా నాయకురాలు మట్ల వాణిశ్రీ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విల్సన్బాబు, ప్రతినిధులు సనాతన్బాబు, సూరిబాబు, వెంగళరావు, టాల్స్టాయ్, అనిల్బాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం