logo

జీతాలివ్వకపోతే ఎలా బతుకుతారు?

సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Published : 06 Dec 2022 01:34 IST

కార్మికులకు ఆర్థికసాయం అందిస్తున్న ఎమ్మెల్సీ ఐవీ

రంపచోడవరం, న్యూస్‌టుడే: సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కార్మికులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట కార్మికులు చేస్తున్న దీక్షలు సోమవారం 12వ రోజుకు చేరాయి. ఎమ్మెల్సీ దీక్షాశిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికుల అవసరాల నిమిత్తం రూ.6,350 ఆర్థికసాయం అందచేశారు. ఆయన మాట్లాడుతూ పది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే భార్య, పిల్లలతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. అనంతరం పీవో గనోరేను కలిసి వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా నాయకురాలు మట్ల వాణిశ్రీ, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విల్సన్‌బాబు, ప్రతినిధులు సనాతన్‌బాబు, సూరిబాబు, వెంగళరావు, టాల్‌స్టాయ్‌, అనిల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని