గిరిజన ప్రాంత అభివృద్ధే ధ్యేయం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు.
గంగవరం, న్యూస్టుడే: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. గంగవరం మండలం కుసుమరాయి, రాజంపాలెం, ఆముదాల బంద గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 23 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పలువురు మహిళలకు వైఎస్సార్ పోషణ కిట్లను అందజేశారు. గంగవరం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించారు. ఇటీవల జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన బాలికలను ఎమ్మెల్యే అభినందించారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, వైస్ ఎంపీపీలు గంగాదేవి, రామతులసి, కోఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, సర్పంచులు అక్కమ్మ, రాజులమ్మ పాల్గొన్నారు.
జగనన్న పాలనలో గడప గడపకు సంక్షేమం
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: జగనన్న పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం మండలంలోని చొంపి పంచాయతీ గ్రామాల్లో రెండో రోజూ నిర్వహించారు. డెర్ని, కందమలివలస, గెమ్మెలి వలస గ్రామాల్లో ఆయన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఎంపీపీ ఉషారాణి, సర్పంచి సుభద్ర, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేష్, మండల పరిషత్ ఏఓ రాంబాబు, వార్డు సభ్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.