అందరి సహకారంతో అగ్రపథానికి..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు అంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు.
గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ సుమిత్
పాడేరు/పట్టణం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు అంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం పాడేరులో 74వ గణతంత్ర దిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సంయుక్త కలెక్టర్ శివ శ్రీనివాస్, ఎస్పీ సతీష్కుమార్, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషేక్, ఏఎస్పీ తుహిన్ సిన్హా, చింతలవీధి సర్పంచి సీతమ్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా పోలీసులు, విద్యార్థులతో పరేడ్ నిర్వహించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, లక్ష్యాలు, పరిపాలనా విధానాన్ని ప్రజలకు వివరించారు. షెడ్యూల్డ్ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో బడుగు, బలహీనవర్గాల ప్రాధాన్యానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల ద్వారా ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతోందన్నారు. రూ.500 కోట్లతో పాడేరులో నిర్మితమవుతున్న వైద్య కళాశాల నిర్మాణం తుది దశలో ఉందని చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరిస్తూ వారి విశ్వాసాన్ని పొందుతున్నామన్నారు. 352 గ్రామ సచివాలయాల ద్వారా 525 రకాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన 574 పనులకు 17 విడతల్లో రూ.19 కోట్లు మంజూరైనట్లు వివరించారు.
ఆపరేషన్ పరివర్తన, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి రంగాల ద్వారా యువత, డ్వాక్రా సంఘాల సభ్యులకు రాయితీపై రుణాలందిస్తున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరుగుతోందన్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రూ.630 కోట్లతో 1250 తాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు జిల్లావ్యాప్తంగా నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పోలీసు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కని ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ శాకల పనితీరుపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను అతిథులు సందర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే