logo

భోజనం అడిగితే చితక్కొట్టింది!

మెనూ ప్రకారంగా భోజనం పెట్టాలని అడిగిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయిని బెత్తంతో దండించిన ఉదంతం జాముగుడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.

Published : 27 Jan 2023 02:28 IST

ప్రధానోపాధ్యాయిని తీరుపై విమర్శల వెల్లువ

జాముగుడలో బాలికలను దండిస్తున్న ప్రధానోపాధ్యాయిని సుజాత

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: మెనూ ప్రకారంగా భోజనం పెట్టాలని అడిగిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయిని బెత్తంతో దండించిన ఉదంతం జాముగుడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. హెచ్‌ఎం కర్రతో విద్యార్థినిని కొడుతున్న దృశ్యాన్ని వారి తల్లిదండ్రులు గురువారం సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో వైరల్‌ అయింది. ఈ నెల 22న జాముగుడ బాలికల పాఠశాలలో మేట్రిన్‌ మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో విద్యార్థినులు  ప్రధానోపాధ్యాయిని సుజాత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఆగ్రహించి బెత్తంతో ఎడాపెడా కొట్టారు. వసతి గృహంలో మేట్రిన్‌ మెనూ అమలు చేస్తున్నారో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయినిపై ఉంది. మెనూ అమలుపై అడిగితే ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు