logo

దొంగని పట్టించిన రోడ్డు ప్రమాదం

ఇద్దరు యువకులు చరవాణిని అపహరించి అనూహ్యరీతిలో చిక్కారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. విశాఖపట్నం కంచరపాలేనికి చెందిన ఇద్దరు యువకులు సింహాచలం ప్రాంతంలోని ఓ హోటల్‌లో బుధవారం మొబైల్‌ను దొంగిలించారు.

Published : 27 Jan 2023 02:28 IST

కొత్తవలస, న్యూస్‌టుడే: ఇద్దరు యువకులు చరవాణిని అపహరించి అనూహ్యరీతిలో చిక్కారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. విశాఖపట్నం కంచరపాలేనికి చెందిన ఇద్దరు యువకులు సింహాచలం ప్రాంతంలోని ఓ హోటల్‌లో బుధవారం మొబైల్‌ను దొంగిలించారు. తప్పించుకునే క్రమంలో విశాఖ- అరకు రహదారిలో ద్విచక్రవాహనంపై ప్రయాణించారు. దేశపాత్రునిపాలేనికి సమీపంలో డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో వారి మొబైల్‌కు పదే పదే ఫోన్‌ వస్తుండటంతో గమనించిన స్థానికుడు అవతలి వ్యక్తితో మాట్లాడాడు. దీంతో అంతకు ముందు ఆ యువకులు ఎలా చరవాణిని దొంగిలించారో తెలుసుకున్నాడు. ఇదంతా గమనించిన ఓ క్షతగాత్రుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మరో యువకుడ్ని విశాఖ, కేజీహెచ్‌కు తరలించారు. స్థానిక వ్యక్తి ఆ మొబైల్‌ను పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కంచరపాలెంలోని వివేకానంద వీధికి చెందిన నామాని మహేష్‌కుమార్‌గా పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఏఎస్సై శ్రీనివాసరావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని