రంప మన్యానికి ఆరోగ్య రక్ష
మన్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.49.26 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారు.
49 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
- రంపచోడవరం, న్యూస్టుడే
మన్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.49.26 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 50 పడకలతో ఉన్న స్థానిక సామాజిక ఆసుపత్రిని ఇటీవల 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. దీంతోపాటు ప్రభుత్వం మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయడంతో గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. ఏరియా ఆసుపత్రి సమీపంలోనే 4.48 ఎకరాల విస్తీర్ణంలో రెండు ఫ్లోర్లలో దీన్ని నిర్మించనున్నారు. రోగుల కోసం 146 పడకలతోపాటు ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక సదుపాయాలను కల్పించబోతున్నారు. ఓపీ సేవలతోపాటు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, డెంటల్ అండ్ పీడియాట్రిక్ సేవలు అందుబాటులో రానున్నాయి.
* గ్రౌండ్ ఫ్లోర్లో డయాలసిస్ విభాగంలో 19, జనరల్ ఐపీ 30, క్యాజువాలిటీ విభాగంలో 20 చొప్పున పడకలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫ్లోర్లో పిల్లల వార్డులో 20, ఆర్థోపెడిక్ వార్డులో 30, జనరల్ ఐపీ వార్డులో 9, సర్జరీ ఐసీయూలో 10, మెడికల్ ఐసీయులో 10, ఫ్రీ, పోస్ట్ ఓపీ విభాగాల్లో 8, రేడియాలజీ విభాగంలో నాలుగు చొప్పున పడకల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.
50 మంది వైద్య నిపుణులు
సుమారు 50 మంది వైద్య నిపుణులతో ఈ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. కార్డియాలజీ, న్యూరో, క్యాన్సర్ శస్త్రచికిత్సలు, ఆర్థోపెడిక్కు సంబంధించి జాయింట్స్ రీప్లేస్మెంట్, ఈఎన్టీకి సంబంధించి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఇక్కడ చేయనున్నారు. ఎండోక్రైనాలజిస్టు (సుగర్, థైరాయిడ్) తదితర సేవలతోపాటు ప్లాస్టిక్ సర్జరీ వైద్యసేవలూ అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, ఎక్స్రే, రక్తపరీక్షల విభాగాలకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు.
త్వరితగతిన పనులు
రంపచోడవరంలో 4.48 ఎకరాల్లో రూ. 49.26 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం.
సీతారామరాజు, ఈఈ, ఏపీఎంఎస్ఐడీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
పేటలో అధికం.. మాడుగులలో అత్యల్పం
[ 28-03-2024]
జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం ఓటర్ల పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు. -
‘ఆధారాలు లేకుండా సరెండర్ చేస్తారా?’
[ 28-03-2024]
విధినిర్వహణలో ఎంతో శ్రమించి ఉద్యోగాలు చేస్తున్న తమను ఏపీఎంలు ఎటువంటి ఆధారాలు లేకుండా రంపచోడవరం వెలుగు ఏపీడీ కార్యాలయానికి సరెండర్ -
అధికార దాహం.. అదుపులేని ప్రచారం!
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వ ప్రచారానికి అంతు లేకుండా పోతోంది. విద్యార్థులకిచ్చే పాఠ్యపుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చివరకు అంగన్వాడీల్లో చిన్నారులకు ఇచ్చే పాలప్యాకెట్లు, పోషకాహారం, చిక్కీలను సైతం తమ ప్రచారాస్త్రంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుంటున్నారు. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 28-03-2024]
ఎంపీగా కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేగా శిరీషారాణిల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కూటమి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
వదలని రంగుల పిచ్చి!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా గ్రామాల్లో వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. -
మొన్న వైకాపా... నేడు తెదేపా
[ 28-03-2024]
చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు. -
పార్టీని విమర్శించే అర్హత వారికి లేదు
[ 28-03-2024]
జనసేన పార్టీని, నేతలను విమర్శించే హక్కు పార్టీని విడిచి వెళ్లిన నాయకులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. -
తాడిని తరలించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 28-03-2024]
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు. -
వైకాపా ప్రచారంలో వాలంటీర్లు
[ 28-03-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఒడిశాలో తెదేపా నాయకుల ప్రచారం
[ 28-03-2024]
నక్కపల్లి మండలానికి చెందిన తెదేపా, జనసేన, భాజపా మత్స్యకార నాయకులు ఒడిశాలో బుధవారం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. -
ప్రభుత్వం మారకపోతే సామాన్యులకు ఇబ్బందులు
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా అరకు పార్లమెంట్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకురి శేఖర్ అన్నారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
[ 28-03-2024]
నక్కపల్లి పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.దుర్గాభవాని విధులు నిర్వహిస్తూ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ రూ.50వేల చెక్ను అందజేశారు. -
జనసేనలోకి వైకాపా నేత
[ 28-03-2024]
ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
సెజ్ కంపెనీ ప్రమాదంలో మరో కార్మికుడి మృతి
[ 28-03-2024]
సెజ్ సింబయో కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..