యువ వైద్యాధికారుల చొరవ
ప్రభుత్వ వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావం చూపారు. జీనబాడు ఉప వైద్య కేంద్రం పరిధిలో వలసలగరువు గ్రామం రైవాడ జలాశయానికి ఆవలి ఒడ్డున అటవీప్రాంతంలో ఉంది.
కొండజర్తకు వెళ్తున్న వైద్యాధికారిణి హిమబిందు
దేవరాపల్లి, న్యూస్టుడే: ప్రభుత్వ వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావం చూపారు. జీనబాడు ఉప వైద్య కేంద్రం పరిధిలో వలసలగరువు గ్రామం రైవాడ జలాశయానికి ఆవలి ఒడ్డున అటవీప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే పడవపై ప్రయాణించాల్సిందే. అక్కడ నివసిస్తున్న పది గిరిజన కుటుంబాల్లోని 30 మందికి వైద్యసేవలు అందడం లేదు. దీన్ని గమనించిన పినకోట యువ వైద్యాధికారులు గేదెల వెంకటేష్, డి.రూప్చంద్తో పాటు ఎంఎల్హెచ్పీ కె.తులసి, హెల్త్ ఎడ్యుకేటర్ రవి, ఏఎన్ఎం కె.పుష్ప, హెల్త్ అసిస్టెంటు బి.రామరాజు తదితరులు చొరవ చూపారు. శుక్రవారం రెండు బోట్లలో సుమారు గంట సేపు రైవాడ జలాశయంలో ప్రయాణించారు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత కిలోమీటరు దూరం అడవిలో నడిచి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గిరిజనులందరికీ వైద్యం చేసి, తిరిగి జీనబాడు చేరుకున్నారు. వైద్య సిబ్బంది తరలివచ్చి వైద్యం అందించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. వైద్యుల చొరవ తెలుసుకుని పలువురు అభినందించారు.
అడవిలో ప్రయాణించి వైద్యమందిస్తున్న సిబ్బంది
ఏడు కిలోమీటర్లు నడిచెళ్లి..
సీలేరు, న్యూస్టుడే: నాటు వైద్యానికి అందరూ దూరంగా ఉండాలని ధారకొండ పీహెచ్సీ వైద్యాధికారిణి డీకే హిమబిందు సూచించారు. శుక్రవారం గుమ్మిరేవుల పంచాయతీ మారుమూల కొండజర్త గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు ఏడు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దాటి వైద్యాధికారి హిమబిందు, సిబ్బంది ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ సుమారు 79 మందికి వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారిణి మాట్లాడుతూ వ్యాధిసోకిన వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందాలన్నారు. నాటువైద్యం, పసరుమందు జోలికి పోవద్దని చెప్పారు. పీహెచ్ఎన్ రాణి, ఫార్మసిస్ట్ మూర్తి, హెచ్ఎస్ పోతురాజు, ఆరోగ్య సహాయకులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM