logo

మందు పెట్టి కోళ్లను చంపేస్తున్నారు

గుర్తు తెలియని వ్యక్తులు బియ్యంలో మందు కలిపి కోళ్లను చంపేస్తున్నారు. ఎటపాక మండలం చింతలచెరువు గిరిజన గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 28 Jan 2023 03:23 IST

ఎటపాక: గుర్తు తెలియని వ్యక్తులు బియ్యంలో మందు కలిపి కోళ్లను చంపేస్తున్నారు. ఎటపాక మండలం చింతలచెరువు గిరిజన గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన కాకా ప్రసాద్‌, సీతయ్య, చందు, సురేష్‌లకు సంబంధించిన పది కోళ్లు మృతి చెందాయి. అనుమానం వచ్చి స్థానికులు ఇళ్ల చెట్టు పక్కల ఉన్న పొలాల్లో పరిశీలించారు. మిరప తోటలో అక్కడక్కడ మందుతో కలిపిన బియ్యం గుర్తించారు. ఒక చోట బియ్యం తిని పక్కనే చనిపోయిన కోడిని చూసినట్లు గ్రామస్థులు తెలిపారు. చనిపోయిన కోడి గొంతుక కోసి చూడగా ఎర్రటి బియ్యం ఉన్నాయన్నారు. మరి కొన్నింటికి ప్రాథమిక చికిత్స చేసి బతికించినట్లు తెలిపారు. గత వారం రోజులుగా గ్రామంలో తరచూ కోళ్లు మృతిచెందుతున్నాయని, ఇప్పటివరకు 100 కోళ్లు చనిపోయాయని చెబుతున్నారు. దీనిపై కృష్ణవరం గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. గ్రామంలో మహిళలు కోళ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేయడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని