ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతే.. దాతల సాయమూ అంతంతే
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హాకీ క్రీడకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. దాతల సాయం అంతంతమాత్రమే. నేర్చుకుందామని ఆసక్తి ఉన్నా పూర్తిస్థాయిలో కోచ్లు లేరు.
జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేయాలి
హాకీ జిల్లా జట్ల కెప్టెన్ల మనోగతం
పోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్ రవికి స్వాగతం
ఎలమంచిలి, న్యూస్టుడే: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హాకీ క్రీడకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. దాతల సాయం అంతంతమాత్రమే. నేర్చుకుందామని ఆసక్తి ఉన్నా పూర్తిస్థాయిలో కోచ్లు లేరు. రోజూ సాధన చేద్దామంటే పరికరాలు అందుబాటులో లేవు. రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొనాలంటే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోంది. కష్టాలు ఎన్ని ఉన్నా జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు బాగుంటుందని రాష్ట్రంలోని హాకీ జట్ల కెప్టెన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలమంచిలి పట్టణంలో అంతర్ జిల్లాల జూనియర్ మహిళా హాకీ పోటీలను శనివారం కలెక్టర్ రవి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన జట్ల కెప్టెన్లు మనోగతాలు ‘న్యూస్టుడే’కి వివరించారు.
మైదానాలు కరవే.. : క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేయడానికి చాలా జిల్లాల్లో సరైన మైదానాలు లేవు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా క్రీడా మైదానాలు ఏర్పాటుచేయాలి. అలా చేస్తే వారాంతం రోజు అయినా అక్కడికి వెళ్లి ఆటలు ఆడతారు. అలా క్రీడలపై గ్రామీణులకు ఆసక్తి పెరుగుతుంది. మండలానికో ఒక కోచ్ను నియమించాలి. అప్పుడే క్రీడారంగానికి గుర్తింపు ఉంటుంది.
జి.వరలక్ష్మి, కాకినాడ జిల్లా
ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ప్రభుత్వం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. చాలామంది క్రీడాకారులు రవాణా ఛార్జీలు సైతం పెట్టుకోలేక పోటీలకు హాజరుకావడం లేదు. ఎక్కడ పోటీలు జరిగినా క్రీడాకారులు రైలు జనరల్ బోగీల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
గొల్ల జయశ్రీ ఎన్టీఆర్ జిల్లా
సీనియర్లకు కోచ్లుగా అవకాశం
గ్రామాల్లో చాలా మందికి హాకీ క్రీడ నేర్చుకోవాలని ఉంటుంది. అయితే వీరి శిక్షణ ఇవ్వడానికి శిక్షకులు లేరు. ప్రతి మండలానికి, నియోజకవర్గానికి ఒక కోచ్ను నియమించాలి. ఇలా చేస్తే సీనియర్ క్రీడాకారులకు కోచ్లుగా అవకాశం దక్కుతుంది.
పి.లావణ్య, గుంటూరు జిల్లా
అకాడమీ ఏర్పాటుతోనే మేలు
క్రీడాకారులకు ఆటల్లో మంచి శిక్ష ఇచ్చి వారిని ప్రోత్సహించడానికి జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేయాలి. అప్పుడే క్రీడాకారులు చక్కగా నేర్చుకోగలరు. నిపుణులైన కోచ్లు శిక్షణ ఇవ్వడం వల్ల ఆటలో మెలకువలు నేర్చుకుంటారు. క్రీడాకారులకు జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తయారవ్వాలంటే అకాడమీ అవసరం. అక్కడ మంచి ఆహారం ఇస్తారు. చక్కగా నేర్పుతారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
ఎస్.కల్యాణి, కెప్టెన్, విశాఖ జిల్లా జట్టు
సామగ్రి ఉచితంగా ఇస్తే సాధన
క్రీడాకారులకు ప్రభుత్వం ఉచితంగా క్రీడా సామగ్రి సరఫరా చేయాలి. మార్కెట్లో వీటి ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రతి పాఠశాలను, కళాశాలను యూనిట్గా తీసుకుని పరికరాలు అందించాలి.
ఎం.లలిత, ప్రకాశం జిల్లా
ఎనిమిది సార్లు జాతీయస్థాయిలో ఆడాను
రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఎనిమిది సార్లు హాకీ నేషనల్స్ ఆడాను. ఆరేళ్లుగా ప్రత్యేక సాధన చేస్తున్నాను. క్రికెట్కి ఉదారంగా సాయం చేసినట్లు హాకీకి సాయం అందించడానికి దాతలు ముందుకు రావడం లేదు.
టి.యువరాణి, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్