Andhra News: చదువుల తల్లిని చిదిమేసిన పేదరికం.. ఫీజులు కట్టలేక బాలిక ఆత్మహత్య
‘అమ్మా.. నేను బీఎస్సీ నర్సింగ్ చదివి మన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాన’ని ఆ చదువుల తల్లి ధైర్యంగా చెప్పేది.
ధనలక్ష్మి పాతచిత్రం
అచ్యుతాపురం, న్యూస్టుడే: ‘అమ్మా.. నేను బీఎస్సీ నర్సింగ్ చదివి మన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాన’ని ఆ చదువుల తల్లి ధైర్యంగా చెప్పేది. ఆర్థికంగా అవకాశం లేకపోయినా ఆ పేద తల్లిదండ్రులు అచ్యుతాపురంలోని ఓ కశాశాలలో చేర్పించారు. అయితే ఫీజులు కట్టలేక చదువు మానేయాలని ఒత్తిడి చేయడంతో జీవితంపై ఆశలొదులుకున్న బాలిక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మళ్లవరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు వివరించారు.
అచ్యుతాపురం మండలం మళ్లవరానికి చెందిన కర్రి రమణ, సన్యాసమ్మ దంపతులకు కర్రి ధనలక్ష్మి (16), కర్రి శ్రీను అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ధనలక్ష్మి పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తల్లిదండ్రులను ఒప్పించి అచ్యుతాపురంలోని నర్సింగ్ కళాశాలలో ఎంపీహెచ్డబ్లూ కోర్సులో చేరింది. పేదరికంతో ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు భయపడినా బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి మంచి ఉద్యోగం చేసి కుటుంబ కష్టాలను తీర్చుతానని తల్లిదండ్రులను ఒప్పించి ఈ బాలిక చదువు ప్రారంభించింది. ఈ బాలిక చదువుకు విధి ఫీజుల రూపంలో అడ్డు తగిలింది. రోజువారీ కూలీపనులపై జీవితాన్ని నెట్టుకొస్తున్న పేద దంపతులు కళాశాలకు ఫీజులు చెల్లించలేమని, చదువు మానేయాలని గట్టిగా చెప్పారు. దీంతో ధనలక్ష్మి చదువులేని జీవితం వృథా అనుకొంది.
ఈనెల 26న తల్లిదండ్రులు కూలీపనుల కోసం పక్క గ్రామానికి వెళ్లిన తరువాత చీమలమందు తాగింది. తమ్ముడు శ్రీను చూసి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు లబోదిబోమంటూ ఇంటికొచ్చి కొనఊపిరితో ఉన్న కుమార్తెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి బతికించుకునేందుకు యత్నించారు. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో విశాఖ కేజీహెచ్కి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం ధనలక్ష్మి కన్నుమూసింది. చదువుల తల్లి మృతిచెందడంతో కళాశాలలోని తోటి విద్యార్థినులు, మళ్లవరం గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ‘ఫీజు కట్టలేక చేతులారా చంపేసుకున్నామా!’ అంటూ ఆ తల్లి సన్యాసమ్మ రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. అచ్యుతాపురం అదనపు ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)