7 కి.మీ. నడిస్తేనే బడి
చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని రాజుక్యాంపు మారుమూలన ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడ 12 కుటుంబాలు నివసిస్తున్నాయి.
అభయారణ్యంలో చిన్నారుల అవస్థలు
న్యూస్టుడే, మోతుగూడెం
కాలినడకన గుట్టలపై ఉన్న రాజుక్యాంపునకు వెళ్తున్న ఆదివాసులు
చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని రాజుక్యాంపు మారుమూలన ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడ 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఫోర్బే జలాశయం పర్యవేక్షణకు జెన్కో సంస్థ ఏర్పాటు చేసిన రహదారి శివారులో గుట్టలపై ఉన్న ఏకైక గిరిజన గ్రామం కావడంతో అటువైపుగా వాహనాల రాకపోకలు ఉండవు.
ఇక్కడి ఆదివాసీలంతా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు 15 మంది వరకు ఉన్నారు. ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ఏడు కి.మీ. దూరంలోని ఫోర్బే గ్రామానికి కాలినడకన వెళ్లాలి. ఇరువైపులా 14 కి.మీ. నడవాల్సిన పరిస్థితి.
కాలిబాటంతా అడవిలో..
కాలిబాటంతా అభయారణ్యంలో ఉండటంతో తరచూ అడవి జంతువులు తారసపడుతుంటాయి. వేసవిలో ఎక్కువగా ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కొంతమంది చిన్నారులు పాఠశాలకు వెళ్లలేమని చదువుకు స్వస్తి చెప్పేశారు. ఐదో తరగతి చదివే ఏడుగురు విద్యార్థుల తల్లిదండ్రులు పనులు మానుకొని తమ పిల్లలకు తోడుగా పాఠశాలకు తీసుకెళ్తున్నారు. వీరు సైతం రోజూ పాఠశాలకు హాజరు కావడం లేదని ప్రధానోపాధ్యాయులు సురేష్ తెలిపారు. ఇంటి పెద్దలు కూలి పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు వంతులవారీగా రోజుకు ఇద్దరు చొప్పున పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చే చిన్నారులు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. వర్షా, వేసవికాలాల్లో వీరి బాధలు వర్ణనాతీతం.
అందని ద్రాక్షలా సదుపాయాలు
ఈ గ్రామస్థులకు ఓటు, రేషన్ కార్డులున్నా తాగునీరు, విద్య, విద్యుత్తు, రహదారి సదుపాయాలు అందని ద్రాక్షలా మిగిలాయి. జెన్కో జలాశయ రహదారి పాయింట్ నుంచి రాజుక్యాంపునకు చేరాలంటే కాలినడకన రెండు కి.మీ. మేర ఎత్తైన గుట్టలు ఎక్కాలి. ఇప్పటికైనా అధికారులు ఈ గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించాలని, గ్రామంలో విద్యా వాలంటీరును నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.