logo

దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

దంపతులు బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా భర్త మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది.

Published : 01 Feb 2023 02:01 IST

కుటుంబ కలహాలే కారణం

హుకుంపేట, న్యూస్‌టుడే: దంపతులు బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా భర్త మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కొట్నాపల్లి గ్రామంలో గెమ్మెలి శివరామ్‌ (29), అతని భార్య అన్నపూర్ణ జీవిస్తున్నారు. వీరికి ఏడాది పాప కూడా ఉంది. సోమవారం శివరామ్‌ మద్యం బాగా తాగి ఇంటికి రావడంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త శివరామ్‌ సమీపంలోని బావి వద్దకు వెళ్లడంతో ఆయన వెంట భార్య కూడా వెళ్లింది. భర్త బావిలో దూకేయటంతో వెంటనే ఆమె కూడా దూకేసింది. గమనించిన గ్రామస్థులు ఇద్దరిని బయటకు తీశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివరామ్‌ నీళ్లు తాగడంతో మృతి చెందాడని, భార్య ప్రాణాలతో బయటపడింది. ఎస్సై సతీష్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని