ముఖ ఆధారిత హాజరుతో సత్ఫలితాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ పేర్కొన్నారు. గురువారం ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు.
డీఈవో రమేష్
పాడేరు, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ పేర్కొన్నారు. గురువారం ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. విద్యా బోధన సక్రమంగా, సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని సర్దుబాటు ప్రక్రియలు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బోధన క్రమపద్ధతిలో జరగడంపై దృష్టి పెట్టామని చెప్పారు. సబ్జెక్టు టీచర్లు కొరత ఉన్న చోట ఇప్పటికే సర్దుబాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేశామన్నారు. గతంలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, విధులకు గైర్హాజరవుతున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందేవన్నారు. ముఖ ఆధారిత హాజరు ప్రక్రియతో ఇవి తగ్గాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మూడు వేల వరకు వివిధ యాజమాన్యాల బడులుంటే 90 శాతం ఉపాధ్యాయులు సకాలంలో వెళ్తున్నారని నివేదికల ద్వారా తెలుస్తోందన్నారు. భవిష్యత్తులో ముఖ ఆధారిత హాజరు ఆధారంగానే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కొందరు మొక్కుబడిగా టీచింగ్ నోట్స్ తయారు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న నోట్ బుక్స్ను కొంత మంది ఉపాధ్యాయులు తమ సొంత అవసరాలకు వాడుకోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రతి నోట్ బుక్ విద్యార్థికి చేరాలని స్పష్టంచేశారు. టీచింగ్ నోట్స్ రాయడంతోపాటు విద్యార్థుల వర్కు బుక్స్ పరిశీలన వంటి పనులు ఉపాధ్యాయుల ప్రాథమిక విధిగా భావించాలన్నారు. ఉపాధ్యాయుల బోధనలో ఎటువంటి లోపాలున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.
పెదబయలు మండలకేంద్రంలోని సీతగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలని తనిఖీ చేయగా అక్కడ ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు పదాలు, లెక్కలు చక్కలు చెప్పారని డీఈవో తెలిపారు. ఉపాధ్యాయుడు గండేరు మాధవరావుకు ప్రశంసాపత్రాన్ని అందిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలెలా?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అత్యంత సున్నిత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు. -
దాహార్తి తీర్చండి...
[ 29-03-2024]
తాగునీటి కొరత, విద్యుత్తు లోవోల్టేజితో ఇబ్బంది పడుతున్నామని మండలంలోని జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం ముంపు గ్రామాలకు నిర్వాసితులు
[ 29-03-2024]
పునరావాస కాలనీల నుంచి పోలవరం ముంపు గ్రామాలకు గిరిజన నిర్వాసితులు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని గిరిజన నిర్వాసితులకు పోతవరం నుంచి ఫజుల్లాబాద్ వరకూ ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. -
నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు
[ 29-03-2024]
మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. -
వైకాపాను చిత్తుగా ఓడించాలి: శిరీషాదేవి
[ 29-03-2024]
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వైకాపాను ఓడించాలని రంపచోడవరం తెదేపా అభ్యర్థినిగా ప్రకటించిన మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. -
చంద్రబాబుపై పూర్తి విశ్వాసం: దొన్నుదొర
[ 29-03-2024]
తెదేపా- భాజపా- జనసేన కూటమి అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీచేసి విజయం సాధిస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియ్యారి దొన్నుదొర అన్నారు -
అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
[ 29-03-2024]
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. -
భవిత బాగుకు కూటమి గెలవాలి
[ 29-03-2024]
పట్టణంలోని రింగు రోడ్డు, ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో గురువారం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు