ఆదివాసీలకు ఆశాదీపం
కొండల్లో.. కోనల్లో ఓ స్థిరమైన జీవనం లేక.. సంచార జాతులుగా సాగుతున్న ఆదిమజాతి గిరిజనుల (పీవీటీజీ- పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్) జీవనంలో స్థితిగతుల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
పీవీటీజీల అభ్యున్నతికి కొత్తగా ‘పీఎం-పీవీటీజీ’
పాడేరు, రంపచోడవరం, న్యూస్టుడే
పీవీటీజీ గ్రామంలో తాగునీటికి ఇక్కట్లు (దాచిన చిత్రం)
కొండల్లో.. కోనల్లో ఓ స్థిరమైన జీవనం లేక.. సంచార జాతులుగా సాగుతున్న ఆదిమజాతి గిరిజనుల (పీవీటీజీ- పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్) జీవనంలో స్థితిగతుల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజా కేంద్ర బడ్జెట్లో పీవీటీజీల అభ్యున్నతికి పీఎం-పీవీటీజీ పేరుతో డెవలప్మెంట్ మిషన్ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పీవీటీజీల అభివృద్ధికి రూ. 15 వేల కోట్లను కేటాయించారు. ఈ నిధులతో వీరు జీవించే ప్రాంతాల్లో రానున్న మూడేళ్లలో రోడ్డు, రవాణాతోపాటు వారి సర్వతోముఖాభివృద్ధికి ఖర్చు చేయనున్నారు.
మన రాష్ట్రంలో పాడేరు ఐటీడీఏ పరిధిలోని పదకొండు మండలాల్లోనే పీవీటీజీల సంఖ్య అధికం. ఈ 11 మండలాల్లో మొత్తం 6.65 లక్షల వరకు జనాభా ఉంటే, ఇందులో 28 శాతం వరకు ఆదివాసీలు ఉంటారు. 3,803 గ్రామాల్లో 960 వరకు గ్రామాల్లో పూర్తిస్థాయిలో వారే జీవనం సాగిస్తుండగా, మరో 700 గ్రామాల్లో కొన్ని కుటుంబాలు నివాసముంటున్నాయి. మొత్తంగా 1600 గ్రామాల్లో వారి ప్రభావముంది. పాడేరు ఏజెన్సీ పరిధిలో ప్రధానంగా పోర్జ, గదబ, కొందు ఉప కులాలున్నాయి.
* రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో నాలుగున్నర లక్షల వరకు జనాభా ఉండగా ఇందులో 55 వేల వరకు పీవీటీజీలున్నారు. 25 వేల వరకు కుటుంబాలున్నాయి. కొండరెడ్డి, కోయ, గదబ, కొండరెడ్డి పూర్జ ఉప కులాలున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లగా పీవీటీజీల సంక్షేమానికి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రత్యేకించి సీసీడీపీ నిధులు రూ. 25 కోట్ల వరకు కేటాయించారు. ఆయా నిధులతో ప్రతి గ్రామంలో కనీసం సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అంగన్వాడీ, సామాజిక భవనాలను ఏర్పాటు చేశారు. కాఫీ, మిరియాలు, పసుపు, రాజ్మా వంటి విత్తనాల పంపిణీలో వీరికి మిగతా సామాజిక వర్గాల కంటే రాయితీ అధికంగా లభించేలా చూస్తున్నారు. సీసీడీపీ నిధులతో కాఫీ పంట విస్తరణకు అవసరమైన యంత్ర సామగ్రితో పాటు మిరియాలను సేకరించేందుకు నిచ్చెనలు రాయితీపై అందించారు. సుమారు 1200 వరకు పాఠశాలలను ఏర్పాటు చేసి వీరి వాడుక భాషలో విద్యాబోధన చేస్తున్నారు. తద్వారా గ్రామాల్లో విద్యపై వారికి మక్కువ పెంచేలా కృషి చేస్తున్నారు. ట్రైకార్, వెలుగు ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించే వ్యక్తిగత రుణాలు శతశాతం రాయితీపై ఇందిస్తున్నారు. గొర్రెలు, మేకలు, సొంతంగా కిరణా దుకాణాలు, జిరాక్సు, టెంట్ హౌస్, ఫొటో స్టూడియో వంటి వ్యాపారాల నిర్వహణకు రుణాలిచ్చారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
వన విధానంలో మార్పు...
రాష్ట్రంలో ఏడు ఐటీడీఏలు ఉంటే అందులో పాడేరు ఐటీడీఏలోనే ఎక్కువ మంది పీవీటీజీ జనాభా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న వారిపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చూపుతూ పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఐటీడీఏ ద్వారా పలు పథకాల్లో వారికి రాయితీలను అందిస్తూ వారి ఉన్నతికి ప్రోత్సాహన్ని అందిస్తున్నాం. తాజాగా కేంద్రం ప్రత్యేకించి వారికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం మంచి పరిణామం. కొత్తగా ప్రవేశ పెట్టిన పీఎం-పీవీటీజీ పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగును నింపేందుకు అవకాశం లభిస్తుందని అనుకుంటున్నా.
రోణంకి గోపాలకృష్ణ, పాడేరు ఐటీడీఏ పీఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా