logo

శ్రమదానంతో కర్రల వంతెన

మండలంలోని కితలంగి పంచాయతీ మారుమూల గ్రామం పాములపుట్టు గ్రామానికి ఇప్పటికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 04 Feb 2023 04:02 IST

కర్రల వంతెన నిర్మాణాన్ని చేపడుతున్న గిరిజనులు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: మండలంలోని కితలంగి పంచాయతీ మారుమూల గ్రామం పాములపుట్టు గ్రామానికి ఇప్పటికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం అంతా చందాలు వేసుకుని మట్టిరోడ్డుతో పాటు, లోయను దాటేందుకు తాత్కాలికంగా కర్రల సాయంతో వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కర్రల వంతెన వర్షాలతో కూలిపోయింది. దీంతో రవాణాకు వీలు లేకుండా పోయింది. గ్రామస్థులంతా కలిసి మట్టిరోడ్డుకు మరమ్మతు, తాత్కాలికంగా కర్రల వంతెనను మరోసారి ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి గ్రామస్థులకు ఏర్పడింది. కాజ్‌వే, రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయని ప్రజా ప్రతినిధులు చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదని గిరిజనులు అంటున్నారు. పాలకులు, అధికారులు గ్రామానికి సందర్శించి రోడ్డు కష్టాలను తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని