logo

రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం.. భార్యకు తీవ్రగాయాలు

దేవరాపల్లి - కొత్తవలస రోడ్డులో గుడిపాల జంక్షన్‌ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.

Published : 04 Feb 2023 02:46 IST

దేవరాపల్లి, కె.కోటపాడు: దేవరాపల్లి - కొత్తవలస రోడ్డులో గుడిపాల జంక్షన్‌ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఎస్సై నాగేంద్ర కథనం ప్రకారం రెండు మోపెడ్లపై వస్తున్న నలుగురిని కొత్తవలస వైపు నుంచి ఎదురుగా వస్తున్న జీపు ఢీకొట్టింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం చినగుడిపాలకు చెందిన బాలిబోయిన సన్నిబాబు (52) మృతి చెందగా, ఆయన భార్య దేముడమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మోపెడ్‌పై వస్తున్న వేపాడ మండలం భర్తవానిపాలెంకు చెందిన లక్ష్మణ, సంజీవరావు గాయపడ్డారు. క్షతగాత్రులను కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని