కొండంత బకాయిలు.. కొండెక్కుతున్న సేవలు!
గిరిజన సహకార సంస్థ... అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో దళారుల మోసాల నుంచి గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థకే ప్రభుత్వం సహకారం కరవైంది.
ఆర్ధిక సంక్షోభంలో జీసీసీ
చింతపల్లి, న్యూస్టుడే
నిత్యావసరాలను గోదాముల్లోకి తరలిస్తున్న హమాలీలు
గిరిజన సహకార సంస్థ... అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో దళారుల మోసాల నుంచి గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థకే ప్రభుత్వం సహకారం కరవైంది. సకాలంలో బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక భారంతో కుంగిపోతోంది.
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) 1956లో ఏర్పాటైంది. మన్యంలో నిత్యావసరాల పంపిణీ బాధ్యతలను భుజానికెత్తుకున్న ఈ సంస్థకు పౌరసరఫరాల శాఖ ఏడాది కాలంగా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో పెట్టుబడులు పెట్టలేక నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. జీసీసీ చింతపల్లి డివిజన్ పరిధిలో చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలున్నాయి. ఈ మూడు మండలాల పరిధిలో శాఖ కార్యాలయాలు, గోదాములతోపాటు మొత్తం 155 డి.ఆర్. డిపోలున్నాయి. ప్రతినెలా విశాఖ నుంచి పౌర సరఫరాలశాఖ గిడ్డంగుల ద్వారా జీసీసీ గోదాములకు బియ్యం, పప్పులతోపాటు ఇతర నిత్యావసర సరకులు వస్తుంటాయి. ఇలా నెలకు సుమారు 130 లారీల వరకూ వస్తాయి. ప్రజలకు సరఫరా చేయాల్సిన బియ్యం, ఇతర నిత్యావసరాలతోపాటు అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమాలు, కళాశాల వసతిగృహాల్లో భోజనాలకు సంబంధించి సరకులన్నింటినీ జీసీసీయే సరఫరా చేస్తోంది. ఇలా సరఫరా చేసే ప్రతి వంద కేజీలకు రూ. 22 చొప్పున హమాలీలకు చెల్లించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖపై ఉంది. నెలకు ఒక శాఖకే సుమారు రూ. 2 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇలా చింతపల్లి డివిజన్ పరిధిలోని మూడు శాఖలకు కలిపి నెలకు హమాలీలకు చెల్లించే ఖర్చే సుమారు రూ. 6 లక్షలకు పైగా ఉంటోంది. సరకుల రవాణాకు నెలకు ఒక శాఖ పరిధిలో సుమారు రూ. 8.58 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఇలా నెలకు మూడు శాఖలకు కలిపి సుమారు రూ. 14 లక్షల వరకూ అవుతోంది. ఇది కాక నిత్యావసరాలను ప్రజలకు, ఇతర సంస్థలకు సరఫరా చేసినందుకు జీసీసీకి పౌర సరఫరాల శాఖ కమిషన్ రూపంలో కొంత నగదు చెల్లించాల్సి ఉంది. ఇలా చెల్లించాల్సిన కమిషన్ బకాయిలు సుమారు రూ. 35 లక్షల వరకూ పేరుకుపోయాయి. ఒక్క చింతపల్లి డివిజన్ పరిధిలోనే గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ హమాలీలు, సరకు రవాణాకు సుమారు రూ. 1.5 కోట్లదాకా చెల్లించాల్సి ఉంది.
కాస్మెటిక్ ఛార్జీలకూ దిక్కులేదు
గిరిజన సంక్షేమ ఆశ్రమాలు, కళాశాల విద్యార్థులకు గతంలో ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించేది. విద్యార్థులకు అవసరమైన షాంపూలు, సబ్బులు, కొబ్బరి నూనెలు, దువ్వెనలు వంటి సామగ్రిని విద్యార్థులకు అందించేవారు. జీసీసీ ద్వారా తయారైన ఉత్పత్తులైన సబ్బులు, షాంపూలు వంటివి జీసీసీ సరఫరా చేసేది. ఇలా సరఫరా చేసిన వాటికి 2017 నుంచి ఐటీడీఏ ఇవ్వడం నిధులు మానేసింది. ఇలా పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 18 కోట్లు ఉండగా, ఒక్క చింతపల్లి జీసీసీ డివిజన్ పరిధిలో సుమారు రూ. 2 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమ ఆశ్రమాలకు సరఫరా చేసిన గ్యాస్ సిలెండర్లకు సంబంధించి సుమారు రూ. 60 లక్షల వరకూ బకాయిలను ఐటీడీఏ చెల్లించలేదు. ఇలా ఇటు పౌర సరఫరాల శాఖ, అటు ఐటీడీఏ చెల్లింపులు చేయకపోవడంతో స్వయంప్రతిపత్తిగల జీసీసీ నిర్వీర్యం అయిపోతోంది.
లేఖలు రాస్తున్నాం
సరకుల పంపిణీకి సంబంధించి జీసీసీకి పౌర సరఫరాల శాఖ ద్వారా చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాల్సిన సంబంధిత ఉన్నతాధికారులకు తరచూ లేఖలు రాస్తున్నాం. కోట్లలో బకాయిలు పేరుకుపోవడంతో జీసీసీ కొంతమేర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సంస్థకు చెందిన నిధులు లేకపోవడంతో అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకూ నిధుల సమస్య ఎదురవుతోంది.
సింహాచలం, జీసీసీ డివిజనల్ మేనేజరు చింతపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!