logo

వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ

దూసరపాము పంచాయతీ సుబ్బంపాడులో నిర్మించిన కోదండ రామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది.

Published : 05 Feb 2023 03:08 IST

ప్రతిష్ఠించిన విగ్రహాలు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: దూసరపాము పంచాయతీ సుబ్బంపాడులో నిర్మించిన కోదండ రామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనధారణ, మండపారాధనలు, అగ్నిప్రతిష్ఠ, జలాధివాసం, క్షీరాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచి చీడి శివ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరిగింది. ఎంపీటీసీ సభ్యుడు ఎన్‌.సత్యనారాయణ, ఉప సర్పంచి ఎ.సత్యనారాయణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు