ఇంకెన్నాళ్లో ఎదురుచూపులు?
కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో.. ఊరికి ఓ దారి ఎప్పుడొస్తుందా ముందుతరాల వారంతా ఎదురు చూపుల్లోనే గడిపారు. ఈ తరంలో ఊరు మొత్తం గంగపాలై, పునరావాసం కోసం వేరేచోటకు వెళ్లాల్సి వచ్చింది.
గూడు లేక.. గోడు పట్టక దుర్భరంగా జీవనం
పునరావాస గ్రామాల్లో వసతులు శూన్యం
గొందూరుకు చెందిన గర్భిణిని పడవపై నుంచి తీసుకు వస్తున్న 108 సిబ్బంది
కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో.. ఊరికి ఓ దారి ఎప్పుడొస్తుందా ముందుతరాల వారంతా ఎదురు చూపుల్లోనే గడిపారు. ఈ తరంలో ఊరు మొత్తం గంగపాలై, పునరావాసం కోసం వేరేచోటకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడా దారితెన్నూ సరిగా లేక బతుకు ఎప్పుడు మారుతుందా అని మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి.
అక్కడకు వెళ్లాలన్నా చిక్కే: 2015లో ఈ నిర్వాసిత గ్రామాలవారికి పశ్చిమ గోదావరి జిల్లా రామన్నగూడెంలో స్థల నిర్థారణ చేసి, పునరావాస కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. తరవాత ప్రభుత్వం మారిపోయి, పనుల వేగం మందగించింది. ఇప్పటికీ ఆ కాలనీల్లో కొన్ని ఇళ్లు ఇంకా నిర్మాణదశలో ఉన్నాయి. కొన్నింటికి మరుగుదొడ్ల ట్యాంకులకు సంబంధించిన పనులు పూర్తి కాలేదు. అంతర్గత సీసీ దారులు, డ్రైనేజీలు, పాఠశాలలు, దేవాలయాలు, శ్మశాన వాటిక, పశువులకు మైదానం లాంటి సౌకర్యాల ఊసు అసలే లేదు. అవేవీ లేకుండా పునరావాసమంటే అక్కడకు వెళ్లి ఏం చేయగలం, ఎలా బతగలమన్న వీరి ప్రశ్నకు సమాధానం చెప్పేవారే కరవయ్యారు.
న్యూస్టుడే, వరరామచంద్రాపురం, చింతూరు
పునరావాస కాలనీలో సెప్టిక్ ట్యాంకు పరిస్థితి చూపుతున్న మాజీ ఉప సర్పంచి ముత్యాలరెడ్డి
ప్రభుత్వాలు స్థలాలు కేటాయించడం తప్ప పునరావాస గ్రామాల్లో వసతులు కల్పించక పోవడంతో అక్కడకు వెళ్లలేక... కొండల్లో, గుట్టల్లో బతుకుతూ దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారు వరరామ చంద్రాపురం మండల నిర్వాసితులు.
* వరరామచంద్రాపురం మండలంలో తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు మారుమూల గ్రామాలు. ఇవి పాపికొండల పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు. పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలోకి వస్తాయి. ఊరికి దారి వస్తుందనే చిన్న ఆశ తీరకుండానే ఈ గ్రామాల్లోని ముందుతరాల వారు వెళ్లిపోయారు. రహదారి వస్తే మిగిలిన సమస్యలు తీర్చుకోవడానికి మంచి అవకాశం దక్కుతుందని చూడటం తర్వాత తరం వారి వంతయింది. 2002లో అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో శబరి నదిపైన బ్రిడ్జితోపాటు పోచవరం నుంచి దేవీపట్నం కలుపుతూ రహదారి నిర్మాణానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పోచవరం నుంచి తుమ్మిలేరు వరకు రహదారి మట్టిపని ప్రారంభించారు. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఆ పనులు ఆగిపోయాయి.
గోదావరే దిక్కు: ఆ తరవాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన రాయి పడటంతో ముంపు గ్రామమని చెప్పి రహదారి సౌకర్యం కల్పించలేదు. వారికి మిగిలిన దారల్లా గోదావరే. నదిలో పడవలపైన, లాంచీలపైన, చిన్నచిన్న దోనెలపైన ప్రయాణం సాగిస్తేనే వారు బాహ్య ప్రపంచంలోకి వస్తారు. వారపు సంతలు, రేషన్ దుకాణాలు, వైద్యం.. ఇలా ప్రతి చిన్న పనికి మండల కేంద్రానికి రావాల్సిందే. అందుకోసం ముందుగా నదిలో 10 కి.మీ. ప్రయాణం చేసి పోచవరం రావాల్సిందే. ప్రధానంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, పిల్లలు సమయానికి వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరదలొస్తే.. కొండలే దిక్కు
వర్షాకాలం వస్తేచాలు, పులిమీద పుట్రలా పోలవరం వెనుకజలాల పోటుకు వరదనీరు ఇప్పుడున్న గ్రామాలను ముంచెత్తుతోంది. విష పురుగులు, క్రూర జంతువులు తిరిగే కొండలపైన నెలల తరబడి తలదాచుకోవాల్సిన దుస్థితి. ఈ వరదల సమయంలో ఏ అనారోగ్య సమస్య వచ్చినా అంతే సంగతులు. ఉగ్ర గోదావరి, అదీ పాపికొండల పరివాహక ప్రాంతం కావడంతో లాంచీలు, పడవలు అక్కడకు వెళ్లలేవు. ఇంతటి విషమ పరిస్థితులను దృష్టి పెట్టుకుని త్వరగా సౌకర్యాలు కల్పించి తరలించాల్సిన పాలకులు హామీలతో కాలం వెళ్లదీస్తున్నారు.
ఇంకా కొందరు గుడారాల్లోనే: వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయిన వారంతా కొండలపైన గుడారాల్లో, పాకల్లో ఉండిపోయారు. నెలలు గడుస్తున్నా పునరావాస కాలనీల్లో పనులు ముందుకు సాగడం లేదు. పాఠశాలలు, దేవాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు కట్టకుండా అక్కడికి మేము ఎలా వెళ్లగలం. బడి లేకుండా పిల్లలను ఎక్కడికి పంపాలి. ఇక్కడున్న గ్రామాలకు వెళ్దామంటే రహదారి లేదు.
వాళ్ల రంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు
వసతులు కల్పించకుంటే ఎలా?: శ్మశాన వాటికలు, పశువులకు మైదానం ఇంతవరకు అక్కడ ఏర్పాటు చేయలేదు. పల్లెవాసులకు ఈ రెండూ చాలా ప్రధానమైనవి. సిమెంట్ దారులు, మురుగు కాలువలు నిర్మించపోతే వర్షాకాలం మళ్లీ బురదనీటిలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, జీడిగుప్ప
సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి: పునరావాస కాలనీల్లో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే. ఒకదాని తరవాత మరొకటి పరిష్కరిస్తారు. దాదాపు రెండువేలపైన నిర్వాసిత కుటుంబాలు 41.15 కాంటూరులో ఉన్నాయి. ప్రతి క్షేత్రస్థాయి సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నాం.
శ్రీధర్, తహసీల్దారు, వీఆర్ పురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
నామినేషన్ల పర్వం నేటి నుంచి
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 18-04-2024]
శ్రీరామనవమి సందర్భంగా బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణంతో శ్రీరామ గిరులు తరించాయి. -
వైకాపా రెబల్గా వంతల రామన్న
[ 18-04-2024]
అరకులోయలో అసెంబ్లీ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు వైకాపా నాయకుడు వంతల రామన్న తెలిపారు. అరకులోయలో బుధవారం తన మద్దతుదారులు, వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 18-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
జానకి రాముల కల్యాణం.. జగమంతా సంబరం
[ 18-04-2024]
మాడుగుల గవర వీధిలో కొలువైన వైభోగ సీతారాముల కల్యాణోత్సవం బుధవారం రాత్రి ఆలయం ప్రాంగణంలో కనులపండువగా జరిగింది. -
కూటమికి మద్దతుగా వేల కి.మీ. బైకుపై ప్రచారం
[ 18-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ
[ 18-04-2024]
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. -
మద్యంతో పోలీసులకు చిక్కిన సూపర్వైజర్
[ 18-04-2024]
మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
ఎండలతో పర్యటక ప్రాంతాలు వెలవెల
[ 18-04-2024]
పర్యటక ప్రాంతం మారేడుమిల్లిలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా సుమారు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవడం గమనార్హం. -
బైకు అదుపుతప్పి ఆర్మీ ఉద్యోగి దుర్మరణం
[ 18-04-2024]
బైకు అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడిన ఘటనలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. చీడికాడ మండలం పెదగోగాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. -
అసౌకర్యాల అరకులోయ
[ 18-04-2024]
ఆంధ్రాఊటీ అరకులోయ పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఉంది. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు. -
నీటి పథకం మోటారుకు మరమ్మతులు
[ 18-04-2024]
మారేడుమిల్లిలోని పంపు హౌస్లో మోటార్కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నిర్మించిన మినీ ట్యాంక్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. -
ఆదివాసీ హక్కులను రక్షించే వారినే బలపర్చండి
[ 18-04-2024]
మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడలో ఇండియా కూటమిని గెలిపించాలని సీపీఎం నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. -
మేమున్నాం.. మీకు తోడుగా..
[ 18-04-2024]
మారేడుమిల్లి పంచాయతీ పరిధిలోని కొత్త కాలనీలో పాఠశాలకు ప్రహరీ లేదు. -
బెల్లం పులుపు ధ్వంసం
[ 18-04-2024]
పెదబొడ్డేపల్లి సమీపంలోని తోటల్లో నిల్వ ఉంచిన బెల్లం పులపును నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ధ్వంసం చేశారు. -
‘రాజీనామా చేయాలని వాలంటీర్లపై ఒత్తిడి’
[ 18-04-2024]
మండలంలో పనిచేస్తున్న వాలంటీర్లు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని సీపీఎం మండల కార్యదర్శి నాగులు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!