పాడేరు రహదారి విస్తరణకు రంగం సిద్ధం
జిల్లా కేంద్రం పాడేరు పట్టణ రహదారిని విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఏడుమీటర్ల వెడల్పున మెయిన్ రోడ్డు సరిపోవడం లేదు.
పాడేరు పట్టణ మెయిన్ రోడ్డు
పాడేరు, న్యూస్టుడే: జిల్లా కేంద్రం పాడేరు పట్టణ రహదారిని విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఏడుమీటర్ల వెడల్పున మెయిన్ రోడ్డు సరిపోవడం లేదు. జన సంచారం, వాహన రద్దీ ఎక్కువ కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రోడ్డు మీదే సంచార వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభిస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన ఉన్నతాధికారులు ప్రధాన రహదారులు విస్తరించాలని సంబంధిత ఆర్అండ్బీశాఖకు ఆదేశించారు.
రెండు వరుసలుగా..
పాడేరు పట్టణ పరిధిలోని అంబేడ్కర్ కూడలి నుంచి మండల పరిషత్తు కార్యాలయం, తలారిసింగి, సెయింటాన్స్ పాఠశాల వరకు రహదారులు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. జిల్లా కేంద్రంగా మారడంతో ఉన్నతాధికారులను కలిసేందుకు జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఇక్కడకు వస్తుండటంతో రద్దీ ఎక్కువైంది. భవిష్యత్తులో ఈ రద్దీ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిని 15 మీటర్లు (సుమారు 45 అడుగులు) మేర విస్తరించాలని యోచిస్తున్నారు. అరకులోయ రహదారుల మాదిరిగా మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి, రెండు వరసలుగా విస్తరిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్అండ్బీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు వ్యాపారవర్గాలతో సమావేశం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని సూచించారు. దీనిపై ఆర్అండ్బీ ఈఈ బాలసుందరను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. జిల్లా కేంద్రంగా మారడంతో వాహన రద్దీ ఎక్కువైందన్నారు. ప్రమాదాలు నివారణకు, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు ఇప్పుడున్న రోడ్డును విస్తరించాల్సి ఉందని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM