అభివృద్ధి చేస్తే అద్భుతాలే!
ఎత్తయిన బండ రాళ్ల పైనుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్న జలపాతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
జి.మాడుగుల, న్యూస్టుడే
గుర్రాయిలో.., కంఠవరంలోని అక్కాచెల్లెమ్మ జలపాతం
ఎత్తయిన బండ రాళ్ల పైనుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్న జలపాతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. మండలంలోని కొత్తపల్లి జలపాతం ఇప్పటికే విశేషంగా ప్రాచుర్యం పొందింది. దీంతోపాటు మండలంలో మరో రెండు ముచ్చటగొలిపే జలపాతాలున్నాయి. వీటి అభివృద్ధికి అధికారులు చొరవ చూపించాల్సి ఉంది.
* సొలభం పంచాయతీ ఎగువ కంఠవరం గ్రామ సమీపంలో అక్కాచెల్లెమ్మ జలపాతం ఉంది. ఇది పెద్దపెద్ద బండరాళ్ల మధ్య నుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ గతంలో పలు సినిమాలు, సీరియల్స్లోని పలు సన్నివేశాలు, పాటలను చిత్రీకరించారు. హీరో సంతోష్ శోభన్ నటించిన ‘లైక్ షేర్, సబ్స్క్రైబ్, హీరో ప్రిన్స్, హీరోయిన్ నందిత నటించిన ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాల్లోని పలు పాటలు, సన్నివేశాలను ఈ పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ జలపాతానికి వెళ్లేందుకు జి.మాడుగుల నుంచి ఎగువ కంఠవరం వరకు తారురోడ్డు సదుపాయం ఉంది. అక్కడ నుంచి అర కిలోమీటరు నడవాలి. గుర్రాయి జలపాతం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ జలపాతం మొత్తం బండరాయిపై పరుపులా పరచుకున్నట్లు ఉంటుంది.
ఎగువ కంఠవరంలో చిత్రీకరించిన నీకు నాకు డాష్ డాష్ చిత్రంలో సన్నివేశం
స్థానికులకు ఉపాధి
కొత్తపల్లి జలపాతం వద్ద గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో వనబంధు కళ్యాణ యోజన ద్వారా రూ. కోటి కేటాయించి మెట్లు, మరుగుదొడ్లు, విద్యుత్తు, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు వంటి సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం ఇక్కడకు భారీగా పర్యటకులు తరలివస్తున్నారు. దీన్ని ఎకో టూరిజంగా ఐటీడీఏ అభివృద్ధి చేసింది. సుమారు 20 మంది స్థానిక యువత ఉపాధి పొందుతున్నారు. ఎగువ కంఠవరంలోని అక్కాచెల్లెమ్మ, గుర్రాయి జలపాతాలను అభివృద్ధి చేస్తే పర్యటకంగా మంచి గుర్తింపు వస్తుందని, తమకూ ఉపాధి దొరుకుతుందని స్థానికులు కోరుతున్నాం.
పీవో దృష్టికి తీసుకెళ్తాం
కంఠవరంలో అక్కాచెల్లమ్మ, గుర్రాయి జలపాతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతాం. ఈ అంశాన్ని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ దృష్టికి తీసుకెళ్తాం. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తాం.
లోహిత్ జయసాగర్, ఎంపీడీవో, జి.మాడుగుల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని