ధర లేక దిగాలు
మన్యంలో బంగాళదుంపలు సాగుచేస్తున్న గిరిజన రైతులు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ముంచంగిపుట్టు, న్యూస్టుడే
వనబసింగిలో బంగాళదుంప సాగు
మన్యంలో బంగాళదుంపలు సాగుచేస్తున్న గిరిజన రైతులు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి సొమ్ము చేతికందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంచంగిపుట్టు మండలం దోడిపుట్టు, వనబసింగి, పేటమాలిపుట్టు, గూడమాలిపుట్టు, గత్తురమండ గ్రామాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది గ్రామాల్లో 30 ఎకరాల్లో బంగాళా దుంపలు సాగు చేశారు. రైతులు ఒడిశా రాష్ట్రంలోని నిర్వహించనున్న వారపు సంతల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేపట్టారు. 40 కేజీల దుంపలను రూ.950 నుంచి రూ.వెయ్యి చెల్లించి కొనుగోలు చేశారు. ఎకరా భూమిలో దుంపలు సాగు చేసేందుకు రూ.40వేల వరకు ఖర్చు చేశామని దిగుబడి లేక ఆర్థికంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.
అందని రాయితీ విత్తనాలు..
కూరగాయలు సాగుచేసే రైతులకు గతంలో పాడేరు ఐటీడీఏ, ఉద్యాన శాఖ సంయుక్తంగా రాయితీపై విత్తనాలు అందించి సాగును ప్రోత్సహించేవారు. మూడేళ్ల నుంచి రైతులకు విత్తనాలు అందించక పోవటంతో రైతులు ఒడిశా వెళ్లి కొనుగోలు చేసుకుని సాగు చేస్తున్నారు. కనీసం సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా అధికారుల నుంచి సహకారం లేదని, అందుబాటులో ఉండే సేంద్రీయ ఎరువులతో పాటు కృత్రిమ ఎరువులు వినియోగిస్తున్నామని, ఎకరాకు రూ.40వేలు వరకు ఖర్చు చేస్తున్నా ఆశించిన దిగుబడి రావటంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దుంపలు చూపుతున్న రైతు
వారపు సంతల్లో విక్రయాలు..
బంగాళాదుంపలు సాగు చేసిన రైతులు ఇక్కడ రైతు బజార్లు లేక ముంచంగిపుట్టు, జోలాపుట్టు, పెదబయలు, లక్ష్మీపురం, బంగారుమెట్ట, బూసీపుట్టు గ్రామాల్లో నిర్వహించనున్న వారపు సంతలో విక్రయిస్తున్నారు. దుంప పరిమాణం తగ్గిపోవడంతో కేజీ రూ.10 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నామని ధర లేక, దిగుబడి లేక నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. నాణ్యమైన విత్తనాలు అందించి కూరగాయల సాగుకు పాడేరు ఐటీడీఏ సహకారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు