అతివల ఆర్థికాభివృద్ధికి కృషి
మన్యంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు పందిరిమామిడిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గత నెలలో ఐదు రోజులపాటు కేవీకేలో 38 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
చేపలు, రొయ్యలతో వంటకాలపై శిక్షణ
రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, వై.రామవరం, చింతూరు మండలాలకు చెందిన 38 మంది డ్వాక్రా మహిళలకు చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, సమోసా, అప్పడాలు, వడియాలు, కట్లెట్, పకోడి తదితర ఆహార పదార్థాలను తయారు చేసే విధానాలను చేసి చూపించారు.
రంపచోడవరం, న్యూస్టుడే: మన్యంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు పందిరిమామిడిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గత నెలలో ఐదు రోజులపాటు కేవీకేలో 38 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (హైదరాబాదు) ఆర్థిక సహాయంతో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లలితకామేశ్వరి ఆధ్వర్యంలో మత్స్య శాస్త్రవేత్త కె.వీరాంజనేయులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా ఆర్థికంగా బలోపేతమవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహిళలకు శిక్షణతోపాటు యంత్ర పరికరాలను అందజేయనున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలూ మంజూరు చేసి దుకాణాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.
శిక్షణలో తయారు చేసిన పచ్చళ్లు
ఎంతో ప్రయోజనం
చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత పదార్థాల తయారీపై ఇచ్చిన శిక్షణతో మాకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తమ గ్రామంలో సొంతంగా పదార్థాలు తయారు చేసి విక్రయిస్తాం.
సిద్దనాతి సత్యవతి, బండిగడ్డ, వై.రామవరం మండలం
భరోసా ఇచ్చారు
ఎటువంటి ఖర్చు లేకుండా మాకు ఉచితంగా చేపలు, రొయ్యలతో ఆహార పదార్థాల తయారీపై అయిదురోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వస్తువులు తయారుచేసి విక్రయించేందుకు యంత్రాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
బందం దుర్గాదేవి, సీతారం, దేవీపట్నం మండలం
శిక్షణతోపాటు సహకారం
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం. ఇందులో భాగంగానే జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆర్థిక సహకారంతో చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ఐదు రోజులపాటు శిక్షణ ఇచ్చాం. కేవలం శిక్షణతో సరిపెట్టకుండా మహిళలు ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఉచితంగా యంత్రపరికరాలను అందిస్తాం. బ్యాంకు రుణాలనూ మంజూరు చేయిస్తాం.
కె.వీరాంజనేయులు, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం