జల విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సహకరిస్తాం
లోయర్ మాచ్ఖండ్, బలిమెల వద్ద జల విద్యుత్కేంద్రాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సుశాంత్ నందా హామీ ఇచ్చారు.
ఒడిశా అటవీశాఖ ఉన్నతాధికారి సుశాంత్ నందా
విద్యుత్తు కేంద్రం వద్ద అధికారుల బృందం
ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్టుడే: లోయర్ మాచ్ఖండ్, బలిమెల వద్ద జల విద్యుత్కేంద్రాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సుశాంత్ నందా హామీ ఇచ్చారు. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్తు కేంద్రాన్ని సుశాంత్ నందా, ఒడిశా జలవిద్యుత్తు కార్పొరేషన్ డైరెక్టర్ ఆశిష్ కుమార్ మహంతి సోమవారం సందర్శించారు. తొలుత వించ్ మార్గంలో మాచ్ఖండ్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. వించ్ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ప్రాజెక్టు విశేషాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్తు కేంద్రానికి విద్యుదుత్పత్తి తీరు అడిగి తెలుసుకున్నారు. ‘న్యూస్టుడే’తో సుశాంత్ మాట్లాడుతూ అత్యంత పురాతన విద్యుత్కేంద్రాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బలిమెల వద్ద ఆంధ్ర-ఒడిశా ఉమ్మడిగా నిర్మించే 60 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం, లోయర్ మాచ్ఖండ్ వద్ద మినీ ప్రాజెక్టు నిర్మాణాలకు కావాల్సిన అటవీ అనుమతులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. డుడుమ జలపాతం వద్ద పంచాయతీల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే మాచ్ఖండ్ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయని, సర్వే చురుగ్గా సాగుతోందన్నారు. ఆధునికీకరణ పూర్తయితే మాచ్ఖండ్లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. జోలాపుట్ మినీ హైడల్, లోయర్ మాచ్ఖండ్, బలిమెల ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాచ్ఖండ్ ఎస్ఈ కె.వి.నాగేశ్వరరావు, ఈఈలు బి.గోవిందరాజులు (జనరేషన్), ఆదిత్య సామంత్ రాయ్ (సివిల్), కొల్లబ్ కె.రమేశ్, ఏడీఈలు రాజ్కుమార్, అమరేంద్ర త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM