ఏకగ్రీవ నిధులకు ఎదురుచూపులు
ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
4.65 కోట్లిచ్చి వెనక్కి తీసుకున్న సర్కారు
ఈనాడు డిజిటల్, పాడేరు, న్యూస్టుడే పాడేరు
ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి స్పందించి జిల్లాలో 75 పంచాయతీలు ముందుకొచ్చాయి. వీటికి జనాభా లెక్కన రూ.5 లక్షల, రూ.10 లక్షలు చొప్పున రూ.4.65 కోట్ల నజరానా ఇవ్వాల్సి ఉంది. పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువు తీరి రెండేళ్లు కావొస్తున్నా సర్కారు ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులను మాత్రం విడుదల చేయలేదు.
ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు అదనంగా ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహక మొత్తం అందుబాటులోకి వస్తే మిగతా గ్రామాలు కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చని సర్పంచులు ఆశపడ్డారు. ఏడాది క్రితం ఓసారి ఏకగ్రీవ నిధులు మంజూరు చేసినట్లే చేసి మరలా వెనక్కి తీసుకున్నారు. ఆర్థిక సంఘం నిధులు పరిస్థితి అంతే..సాధారణ నిధులున్నా ఖర్చుపెట్టడానికి ఆంక్షలు పెడుతుండడంతో ఏకగ్రీవ పంచాయతీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
పాడేరు డివిజన్లోని పదకొండు మండలాల్లో 244 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొయ్యూరు మండలం మంపతో పాటు గూడెంకొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక సొమ్ము అందాల్సి ఉంది. పేరుకు ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించిదే తప్ప ప్రభుత్వ ఉత్తర్వులు అందించి ఏడాదిన్నర గడుస్తున్నా నేటికీ ఒక్క పైసా కూడా రాలేదు. ఇదిగో..అదిగో అంటున్నారు తప్పితే నేటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు అందలేదని మంప సర్పంచి త్రినాథ పడాల్ చెబుతున్నారు.
కొయ్యూరు మండలం మంప పంచాయతీ కార్యాలయం
నిధుల్లేక ఇబ్బందులు..
ప్రోత్సాహక సొమ్ము వస్తుందని చూస్తున్నాం. ఇంతవరకు పైసా వేయలేదు. గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దీని నివారణకు ప్రధాన మురుగు కాలువపై పలకలు వేయాలి. దీంతో పాటు వీధి రోడ్లు నిర్మాణం, కుళాయిలు వేయించాలి. గ్రామం చిన్నది కావడంతో నిధులరాక అంతంతమాత్రంగా ఉంది. అధికారులను అడుగుతుంటే అందరితోపాటే వస్తాయి అంటున్నారు తప్పితే, ఎప్పుడనేది చెప్పడంలేదు.
ఫాతిమున్నీసా బేగం, సర్పంచి పెదబోదిగల్లం
మురుగు సమస్య వేధిస్తోంది..
జి.భీమవరం పంచాయతీలో మురుగు పారుదల సమస్య తీవ్రంగా ఉంది. అయినా పరిష్కరించలేని పరిస్థితి. శివారు సింగవరంలో మరింత అధ్వానంగా ఉంది. మురుగుకాలువలు, రహదారులు లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏకగ్రీవ నిధులు మంజూరు కాగానే వీటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం.
హనుమంతు వెంకట లక్ష్మణరావు, జి.భీమవరం సర్పంచి
జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ ఏకగ్రీవమైంది. దీని పరిధిలో 21 గ్రామాలున్నాయి. ప్రోత్సాహక నిధులు వస్తే అభివృద్ధి చేసుకోవచ్చని సర్పంచి బుటారి ముత్యాలమ్మ ఆశించారు. ఏళ్లు గడుస్తున్నా ఆ నిధులు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీకి వెళ్లేందుకు రహదారి లేదని చాలా గ్రామాల్లో కనీసం తాగునీరు దొరకడం లేదన్నారు.
డీఎల్పీవో కుమార్ను వివరణ కోరగా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలను గుర్తించిందని, త్వరలో నిధులు విడుదల కానున్నట్లు చెప్పారు. రంపచోడవరం డివిజన్లోని రెండు ఏకగ్రీవ పంచాయతీలకు ఇదివరకే నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!