‘హైడ్రో ప్రాజెక్టులతో కేంద్రానికి సంబంధం లేదు’
ఎర్రవరంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు స్పష్టంచేశారు.
మాట్లాడుతున్న కురుసా ఉమామహేశ్వరరావు
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: ఎర్రవరంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు స్పష్టంచేశారు. బుధవారం స్థానిక భాజపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం ఇక్కడి నాయకులు చేస్తున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే తీర్మానం చేసిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకున్నారన్నారు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం భాజపా పాటుపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అనుమతులు నిలిపేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజనుల తరపున పోరాటాలు చేస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గిరిజనులకు 20 లక్షల ఇళ్లు, జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది రూపాయలతో ఇంటింటికీ తాగునీరు పథకం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం పింఛన్లు, రేషన్కార్డులు తొలగిస్తోందని ఆరోపించారు. మార్చి 10 నుంచి 30 వరకు నుంచి ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు బోనంగి బాలయ్యపడాల్, బాలకృష్ణ, వసుపరి శ్రీను, కదుల్ల శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ