logo

50 కేజీల గంజాయి పట్టివేత

ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి కార్లలో తరలిస్తున్న గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు బుధవారం పట్టుకున్నారు.

Published : 09 Feb 2023 02:11 IST

గంజాయి, నిందితులతో పోలీసలు

చింతూరు, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి కార్లలో తరలిస్తున్న గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. చింతూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడింది. నిందితుల నుంచి 50 కేజీల గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. తమిళనాడుకు చెందిన విజయ్‌కుమార్‌, రాజు, రాజేశ్‌, సుబ్రహ్మణ్యం, విజయ్‌కుమార్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన హరిదాసును అరెస్టు చేశామని చెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని