మిరప రైతు విలవిల
విలీన మండలాల్లో మిరప పంట ప్రధానమైంది. దీన్ని పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.
ఎటపాక చింతూరు, న్యూస్టుడే
గౌరిదేవిపేటలో మిరప పొలం
విలీన మండలాల్లో మిరప పంట ప్రధానమైంది. దీన్ని పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పంటలకు చీడపీడలు ఆశించి అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోదావరి వరదలతో ఈ ఏడాది సాగు ప్రారంభం నుంచి సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వేలల్లో కౌలు చెల్లింపు..
గత రెండేళ్లుగా విలీన మండలాల్లో కౌలు రేట్లు కొండెక్కాయి. గత ఏడాది ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.40 వేలు వరకు చెల్లించేవారు. పంట దిగుబడి వస్తే కనీసం అప్పులు తీరతాయన్న ఆశతో రైతులు కౌలు చెల్లించి సాగుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది సాగు ఆలస్యం కావడంతో మరో దారి లేక రైతులు మిర్చి పంటపై ఆధారపడ్డారు. సాగు, సస్య రక్షణకు ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. తీరా పూత, కాత దశలో తామర, రసం పీల్చే పురుగులు, నల్లి దాడికి పంటలు పాడవుతున్నాయి.
గత ఏడాదీ ఇదే తీరు..
చింతూరు డివిజన్లోని ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేస్తున్నారు. గత ఏడాది సైతం ఈ పంటను వేల ఎకరాల్లో సాగుచేశారు. పూత దశలో తామర తెగులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు పరిశీలించి ఈ తెగుళ్లకు మందులు లేవని చెప్పారు. అంతంత మాత్రం దిగుబడి రావడంతో అప్పుల్లో ఇరుక్కున్నారు. ఈ ఏడాది ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
దిగుబడి తగ్గుముఖం
మిరప దిగుబడి గత రెండేళ్లుగా గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఎకరాకు సగటున 25 క్వింటాళ్లు వస్తుంది. పురుగుల దాడికి ఈ పరిస్థితి తారుమారైంది. గత ఏడాది ఎకరాకు కనీసం 10 నుంచి 15 క్వింటాళ్లు వస్తాయని ఆశించారు. తీరా కనీసం రెండంకెల సంఖ్య కూడా దాటలేదు. ప్రస్తుతం పురుగు ఉద్ధృతి పెరగడంతో ఎకరాకు సగటున 5 నుంచి 10క్వింటాళ్లు మించేలా లేదని రైతులు చెబుతున్నారు.
పొలంలో ఏర్పాటు చేసిన జిగురు అట్ట
మిరప పంటకు తామర, నల్లి రసం పీల్చే పురుగు ఆశించడంతో మొక్కలు కళావిహీనంగా మారుతున్నాయి. పూతలో సైతం అయిదు నుంచి పది పురుగులు ఉంటున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మండలాల్లో 5,680 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు.
అయిదు ఎకరాల్లో వదిలేశా..
ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నా. ప్రస్తుతం పంటకు తెగులు ఎక్కువగా సోకడంతో అయిదు ఎకరాలు పూర్తిగా దెబ్బతింది. దానికి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టినా ప్రయోజనం ఉండదని వదిలేశాను. మిగిలిన పది ఎకరాలు సాగు చేస్తున్నా. వాటికీ పురుగు సోకింది. ఎకరాకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా. దిగుబడి తగ్గితే తీవ్రంగా నష్టపోతాను.
శ్రీనివాసరావు, మిరప రైతు, నెల్లిపాక
సూచనలు పాటించాలి
మిరప రైతులు విధిగా అధికారుల సూచనలు పాటించాలి. తెగుళ్ల భయంతో అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకూడదు. దాని వల్ల పంటలకు ఎక్కువ నష్టం. తామర పురుగు, నల్లి బెడద అధికంగా ఉంది. వీటి నివారణకు పొలాల్లో జిగురు అట్టలు, నీలం, పసుపు, తెలుపు రకాలు ఏర్పాటు చేసుకోవాలి. పది మీటర్ల దూరంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా తామర పురుగు నల్లి జిగురు అట్టలకు అంటుకుని చనిపోతాయి. తామరపురుగు ఒక్కసారి వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. దీనివల్ల పొలాల్లో సులువుగా విస్తరిస్తుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి.
కాశీవిశ్వనాథ చౌదరి, ఏడీఏ, రంపచోడవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ