ఊరూరా దాహం కేకలే
వేసవి ప్రారంభంలోనే జిల్లాలోని ప్రతి ఊరిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదురవకుండా ఏటా ప్రత్యేక నిధులు విడుదలవుతూనే ఉన్నాయి.
వేసవి ముందే తాగునీటి సమస్య ఉద్ధృతం
పూర్తిస్థాయిలో గొంతు తడపని జల్జీవన్
పాడేరు పట్టణంలో తాగునీటికి మహిళల ఇక్కట్లు
వేసవి ప్రారంభంలోనే జిల్లాలోని ప్రతి ఊరిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదురవకుండా ఏటా ప్రత్యేక నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. వీటితో సీజన్లో మొక్కుబడిగా మరమ్మతులు చేపట్టి ఆ తర్వాత ఆ పథకం ముఖం చూసేందుకు సైతం గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇష్టపడడం లేదు. దీని ఫలితంగా నీటి పథకాలు మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. సమగ్ర కార్యాచరణతో తాగునీటి పథకాలు వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ఇబ్బందులు కొంత వరకైనా పరిష్కారమయ్యేవి.
పాత పాడేరు గ్రామంలో వృథాగా పడి ఉన్న పైపులు
పల్లెల్లో తాగునీటిని సరఫరా బాధ్యతలు పర్యవేక్షించేందుకు గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఉంది. గతంలో ప్రపంచబ్యాంకు ద్వారా ప్రతి మండల కేంద్రంలో రక్షిత పథకాలు నిర్మించారు. నిధుల లేమితో వీటిలో కొన్ని నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సౌర విద్యుత్తు తాగునీటి పథకాలు 700 వరకు నిర్మించారు. సరైన పర్యవేక్షణ, నిర్వహణ సక్రమంగా లేక ఈ పథకం కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.
* ఇది కూడా చాలాచోట్ల అందుబాటులో ఉన్న పాత పథకానికే అనుసంధానం చేశారు. గతంలో విఫలమైన పథకాలకు తరచూ మరమ్మతులు వస్తున్నాయని... వాటికే జల్జీవన్ అనుసంధానం చేయడం వల్ల నిధులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదని గ్రామస్థులు ఆమోదించడం లేదు. ఈ కారణంగా గ్రామాల్లో జల్జీవన్ నత్తనడకన సాగుతోంది.
పాత పాడేరుో ఆరు నెలలుగా బోరు వేసి వదిలేశారిలా..
సగానికి పైగా గ్రామాల్లో..
జిల్లా పరిధిలో పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ మండలాలున్నాయి. మొత్తంగా 4500కు పైగా గ్రామాలున్నాయి. పాడేరు ఐటీడీఏ పరిధిలో 3576 గ్రామాలుండగా ఇందులో వెయ్యికి పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారుల సర్వేలోనే వెల్లడైంది. ఇదే సమయంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలో 800 గ్రామాల వరకు ఉండగా, ఇందులో 300కు పైగా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది.
* రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో దేవిపట్నం పంచాయతీ తూనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సౌరవిద్యుత్తు పథకం ఏడాదిగా మరమ్మతులకు గురైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకునే పాపాన పోలేదు. ఈ డివిజన్ పరిధిలో భూపతిపాలెం, ముసురుమల్లి జలాశయాల నుంచి కొన్ని ప్రాంతాలకే తాగునీరు సరఫరా అవుతోంది. చింతూరు ఐటీడీఏ పరిధిలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఊటనీటినే వారు వినియోగించుకోవాల్సి వస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో బోర్లు, బావులు ఎక్కువగా మరమ్మతులకు గురయ్యాయి. రంపచోడవరం డివిజన్ కేంద్రంలో తాగునీటి సమస్య అంతగా లేకపోయినా ఇతర ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువగానే ఉంది.
* పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో వెయ్యికి పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాడేరు పట్టణంలో 20 వేల జనాభా నివాసముంటున్నారు. ఇక్కడ పాత, కొత్త పథకాలతో కలుపుకొని నాలుగు వరకు రక్షిత పథకాలున్నాయి. ఇందులో నాలుగు దశాబ్దాల క్రితమే రూ. కోటి ఖర్చుతో పథకం నిర్మించారు. ఈ పథకం ద్వారా లోచలిపుట్టు, గుడివాడ, సినిమాహాల్ కూడలి, మసీదు కాలనీలకు తాగునీరు అందించాల్సి ఉంది.
* ప్రతి ఏటా మోదకొండమ్మ అమ్మవారి పండగ మూడు రోజులపాటు ఈ పథకాన్ని బాగుచేసి నీటి సరఫరా చేస్తారు. ఈ నీరూ తాగేందుకు ఉపయోగపడదు. ఈ పథకానికి ఏటా నిర్వహణ ఖర్చుల కింద రూ. 4 లక్షల వరకు వెచ్చిస్తారు. ఇప్పటికి పదేళ్లుగా ప్రతి ఏటా రూ.40 లక్షల వరకు వెచ్చించారు. అయినా ఏడాదిలో పట్టుమని నెల రోజులు కూడా నీరు రాదు. పట్టణంలో మిగతా మూడు పథకాల నుంచి వారంలో మూడు రోజులే ప్రజలకు నీరందుతోంది. అదీ అరకొరగానే. పట్టణవాసులందరికీ బయట మార్కెట్లో కొనుగోలు చేసిన నీరే ఆధారం.
* పాడేరు మండలం కొయ్యూరు, కక్కి, డోకులూరు, బడిమెల, కించూరు వంటి ప్రాంతాల్లో నీటి కొరత ఎక్కువగానే ఉంది. ఇదే మండలం కక్కి గ్రామంలో గతంలో రూ. 10 లక్షలతో ఓ పథకాన్ని నిర్మించారు. ఇది విఫలం కావడంతో జల్జీవన్ ద్వారా మరో రూ. 12 లక్షలు ఇదే పథకానికి మంజూరు చేశారు. ఈ పథకానికి నిధులు సరిపోవడం లేదని ట్యాంకు నిర్మాణం మధ్యలోనే గుత్తేదారు ఆపేశాడు. కొత్తగా నిధులొస్తేనే పథకం ముందుకెళ్తుంది. చింతపల్లి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండల కేంద్రాల్లో పేరుకు రక్షిత పథకాలున్నా ప్రజల దాహార్తిని తీర్చడం లేదు. ఒక్క కొయ్యూరు మండల పరిధిలోనే 82 గ్రామాల్లో నీటి పథకాలు అందుబాటులో లేవు.
* అరకులోయ నియోజకవర్గం పరిధిలో నీటి సమస్య ఉద్ధృతంగానే ఉంది. అరకులోయ పట్టణ పరిధిలో పట్టణ వాసులకు తాగునీరు పూర్తిగా అందడం లేదు. ముంచంగిపుట్టు మండలంలో 100కు పైగా గ్రామాల్లో నీటి పథకాల ఉనికే లేదు. మంచంగిపుట్టు మండలం కేంద్రానికి తాగునీరు అందించేందుకు సుజనకోట ప్రాంతంలో రక్షిత ప్రాజెక్టు నిర్మించారు. ఏడు గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సి ఉండగా సగం గ్రామాలకు కూడా పూర్తిస్థాయిలో నీరందడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM