డౌనూరు వైద్యాధికారి, డ్రైవర్ జీతం నిలిపివేత
చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
చింతపల్లి ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, చిత్రంలో డీసీహెచ్ శంకర్ప్రసాద్, డాక్టర్ కీర్తి
చింతపల్లి గ్రామీణం, కొయ్యూరు, న్యూస్టుడే: చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించి వైద్యసేవలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి శస్త్రచికిత్స గది సిద్ధం చేయాలని సూచించారు. వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం లంబసింగి, తాజంగి గ్రామ సచివాలయాలను తనిఖీలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ముఖహాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్ప్రసాద్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, ఎంపీడీఓ సీతయ్య, చింతపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు.
* అనంతరం కొయ్యూరు మండలం డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ గోపాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీచేశారు. హాజరుపట్టీ, రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి లలిత, అంబులెన్స్ డ్రైవర్ కాంతారావు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వీరిద్దరి జీతాలు నిలిపేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. మందుల నిల్వలు, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలపై ఆరా తీశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
పేటలో అధికం.. మాడుగులలో అత్యల్పం
[ 28-03-2024]
జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం ఓటర్ల పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు. -
‘ఆధారాలు లేకుండా సరెండర్ చేస్తారా?’
[ 28-03-2024]
విధినిర్వహణలో ఎంతో శ్రమించి ఉద్యోగాలు చేస్తున్న తమను ఏపీఎంలు ఎటువంటి ఆధారాలు లేకుండా రంపచోడవరం వెలుగు ఏపీడీ కార్యాలయానికి సరెండర్ -
అధికార దాహం.. అదుపులేని ప్రచారం!
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వ ప్రచారానికి అంతు లేకుండా పోతోంది. విద్యార్థులకిచ్చే పాఠ్యపుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చివరకు అంగన్వాడీల్లో చిన్నారులకు ఇచ్చే పాలప్యాకెట్లు, పోషకాహారం, చిక్కీలను సైతం తమ ప్రచారాస్త్రంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుంటున్నారు. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 28-03-2024]
ఎంపీగా కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేగా శిరీషారాణిల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కూటమి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
వదలని రంగుల పిచ్చి!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా గ్రామాల్లో వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. -
మొన్న వైకాపా... నేడు తెదేపా
[ 28-03-2024]
చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు. -
పార్టీని విమర్శించే అర్హత వారికి లేదు
[ 28-03-2024]
జనసేన పార్టీని, నేతలను విమర్శించే హక్కు పార్టీని విడిచి వెళ్లిన నాయకులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. -
తాడిని తరలించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 28-03-2024]
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు. -
వైకాపా ప్రచారంలో వాలంటీర్లు
[ 28-03-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఒడిశాలో తెదేపా నాయకుల ప్రచారం
[ 28-03-2024]
నక్కపల్లి మండలానికి చెందిన తెదేపా, జనసేన, భాజపా మత్స్యకార నాయకులు ఒడిశాలో బుధవారం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. -
ప్రభుత్వం మారకపోతే సామాన్యులకు ఇబ్బందులు
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా అరకు పార్లమెంట్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకురి శేఖర్ అన్నారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
[ 28-03-2024]
నక్కపల్లి పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.దుర్గాభవాని విధులు నిర్వహిస్తూ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ రూ.50వేల చెక్ను అందజేశారు. -
జనసేనలోకి వైకాపా నేత
[ 28-03-2024]
ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
సెజ్ కంపెనీ ప్రమాదంలో మరో కార్మికుడి మృతి
[ 28-03-2024]
సెజ్ సింబయో కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ