logo

మరోసారి ఘాట్‌లో నిలిచిన రాకపోకలు

పాడేరు ఘాట్‌రోడ్డులో తరచూ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇరుకైన మలుపుల వద్ద భారీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.

Published : 24 Mar 2023 02:35 IST

పాడేరు ఘాట్‌రోడ్డులో తరచూ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇరుకైన మలుపుల వద్ద భారీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. తాజాగా గురువారం ఘాట్‌రోడ్డులో ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద ఓ లారీ మధ్యాహ్నం  ఒంటిగంట నుంచి నాలుగు గంటల వరకు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా ఘాట్‌రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయిల్‌ ట్యాంకర్లను తాటిపర్తి వద్ద నిలిపివేశారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ స్తంభించింది.

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని