logo

ఎమ్మెల్సీగా అనురాధ విజయం పై హర్షం

ఎమ్మెల్సీగా తెదేపాకు చెందిన పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హర్షం ప్రకటించారు.

Published : 24 Mar 2023 02:35 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీగా తెదేపాకు చెందిన పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల స్థానం నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు గెలుపొందడంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో అనురాధ విజయం సాధించడం అభినందనీయమన్నారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందన్నారు.

వైకాపాకు పతనం తప్పదు: ఈశ్వరి

పాడేరు పట్టణం: ఎమ్మెల్సీ ఎన్నికలో అనురాధ విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయంతో వైకాపా ప్రభుత్వానికి పతనం తప్పదని నిరూపితమైందని పాడేరు నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. పాడేరు మండలం కుమ్మరిపుట్టులో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ నిన్న పట్టభద్రులు, నేడు ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు గెలవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం తెదేపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి సింహాచలం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వెంకట సురేష్‌కుమార్‌, నియోజకవర్గ ఎస్టీ సెల్‌ అధ్యక్షులు జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని