ఉచిత చికిత్స దాతల చేయూత
చికిత్స చేయగలిగిన వ్యాధే అయినా క్షయ ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉంటోంది. పలువురు మృత్యువాత పడటానికి కారణమవుతోంది.
చింతపల్లి గ్రామీణం, అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే
చికిత్స చేయగలిగిన వ్యాధే అయినా క్షయ ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉంటోంది. పలువురు మృత్యువాత పడటానికి కారణమవుతోంది. విస్తృత పరీక్షలు, పూర్తిస్థాయి చికిత్స అందించడం ద్వారా ఈ వ్యాధి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. శుక్రవారం ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా జిల్లాలో ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ‘న్యూస్టుడే’ కథనం.
మనదేశంలో 1962లో తొలిసారి జాతీయ క్షయ నివారణ కార్యక్రమం చేపట్టారు. 1998లో కొన్ని మార్పులు చేసి సవరించిన కార్యక్రమంగా చేపట్టారు. 2020 నుంచి జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్టీఈపీ) రూపొందించారు.
క్షయరహిత సమాజ స్థాపనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే టీబీ సోకినవారికి ఉచితంగా మందులు అందిస్తోంది. దీంతో రోగులు కోలుకోవడానికి అవసరమైన పోషకాహారం సైతం ఉచితంగా సమకూరుస్తున్నారు. ఇందుకోసం దాతల చేయూత తీసుకుంటున్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన టీబీ ముక్తభారత్ పిలుపులో భాగంగా వ్యాధి సోకినవారికి పోషకాహారానికి అవసరమయ్యే డబ్బు విరాళాలుగా ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో వివిధ పరిశ్రమల నిర్వాహకులు కార్పొరేట్ సామాజిక సేవా బాధ్యతలో (సీఎస్ఆర్) భాగంగా ఒక్కో రోగికి పోషకాహారం కోసం రూ. 700 చొప్పున అవసరమైన నగదు సహాయం ఇటీవల అందజేశారు. 771 మందికి ఈ నగదుతో పోషకాహారం అందించనున్నారు.
వ్యాధి లక్షణాలు
రెండువారాలకు మించి జర్వం, దగ్గు, నోటి నుంచి రక్తంతో కూడిన కళ్లె పడడం, క్రమేపీ బరువు తగ్గడం, ఛాతి ఎక్స్రేలో తేడాలు వ్యాధి ప్రధాన లక్షణాలు ఈ వ్యాధి ముఖ్యంగా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీంతోపాటు శరీరంలోని ఏ భాగానికైనా సోకే అవకాశం ఉంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. సాధారణ మైక్రోస్కోప్, ఎక్స్రే, ఆర్టీపీసీఆర్, ఆధునిక బీనాట్ మిషన్, పాథో లాజికల్ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.
* అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్షయవ్యాధి గుర్తింపు పరీక్షలు చేస్తున్నారు.
* జిల్లాలో 25 కళ్లె పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో లక్ష జనాభా, మన్యంలో 50 వేల మంది జనాభాకు వీరు సేవలు అందిస్తున్నారు. అనకాపల్లి, నర్సీపట్నంలో రెండు సీబీ నాట్ పరికరాల ద్వారా కళ్లె, శరీరంలోని ఇతర భాగాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు.
ఆరు నెలలు ఉచిత మందులు
క్షయ సోకినట్లు గుర్తించిన రోగికి ఆరు నెలల పాటు ఉచితంగా మందులు అందిస్తాం. ఈ వ్యాధి లక్షణాలతో వచ్చిన వ్యక్తికి ముందస్తుగా సామాజిక ఆసుపత్రిలో ట్రూనాట్ పరికరంతో కళ్లె పరీక్ష చేస్తాం. వ్యాధి ఉన్నట్లు తేలితే ఆరు నెలల పాటు డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ (డాట్) పద్ధతి ద్వారా ఆశా కార్యకర్తల సహాయంతో రోగికి రోజూ క్రమం తప్పకుండా మందులు ఇస్తాం. ఆరు నెలల్లో స్వస్థత పొందేందుకు పోషకాహారం కోసం ప్రతీ నెలా రూ. 500 ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. టీబీ సోకిన వ్యక్తికి ఇతరత్రా వైద్య పరీక్షలు అవసరమైతే కేజీహెచ్కి పంపుతాం. ఇంకా అవసరమైతే విశాఖ ఛాతి వ్యాధుల ఆసుపత్రికి తరలించి ఆధునిక చికిత్స అందించి రోగి కోలుకోవడానికి కావాల్సిన సహకారం అందిస్తాం.
మారమ్మ, వైద్యాధికారి, టీబీ నివారణ, లంబసింగి
12 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాల్లో గుర్తింపు పరీక్ష నిర్వహిస్తున్నారు.
గతేడాది 44,582 మందికి పరీక్షలు చేయగా, 2249 మందికి వ్యాధి ఉందని తేలింది.
ఈ ఏడాది ఇంతవరకు 6,741 మందికి పరీక్షలు చేయగా 505 మందికి నిర్ధారణ అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
పేటలో అధికం.. మాడుగులలో అత్యల్పం
[ 28-03-2024]
జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం ఓటర్ల పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు. -
‘ఆధారాలు లేకుండా సరెండర్ చేస్తారా?’
[ 28-03-2024]
విధినిర్వహణలో ఎంతో శ్రమించి ఉద్యోగాలు చేస్తున్న తమను ఏపీఎంలు ఎటువంటి ఆధారాలు లేకుండా రంపచోడవరం వెలుగు ఏపీడీ కార్యాలయానికి సరెండర్ -
అధికార దాహం.. అదుపులేని ప్రచారం!
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వ ప్రచారానికి అంతు లేకుండా పోతోంది. విద్యార్థులకిచ్చే పాఠ్యపుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చివరకు అంగన్వాడీల్లో చిన్నారులకు ఇచ్చే పాలప్యాకెట్లు, పోషకాహారం, చిక్కీలను సైతం తమ ప్రచారాస్త్రంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుంటున్నారు. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 28-03-2024]
ఎంపీగా కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేగా శిరీషారాణిల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కూటమి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
వదలని రంగుల పిచ్చి!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా గ్రామాల్లో వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. -
మొన్న వైకాపా... నేడు తెదేపా
[ 28-03-2024]
చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు. -
పార్టీని విమర్శించే అర్హత వారికి లేదు
[ 28-03-2024]
జనసేన పార్టీని, నేతలను విమర్శించే హక్కు పార్టీని విడిచి వెళ్లిన నాయకులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. -
తాడిని తరలించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 28-03-2024]
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు. -
వైకాపా ప్రచారంలో వాలంటీర్లు
[ 28-03-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఒడిశాలో తెదేపా నాయకుల ప్రచారం
[ 28-03-2024]
నక్కపల్లి మండలానికి చెందిన తెదేపా, జనసేన, భాజపా మత్స్యకార నాయకులు ఒడిశాలో బుధవారం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. -
ప్రభుత్వం మారకపోతే సామాన్యులకు ఇబ్బందులు
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా అరకు పార్లమెంట్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకురి శేఖర్ అన్నారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
[ 28-03-2024]
నక్కపల్లి పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.దుర్గాభవాని విధులు నిర్వహిస్తూ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ రూ.50వేల చెక్ను అందజేశారు. -
జనసేనలోకి వైకాపా నేత
[ 28-03-2024]
ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
సెజ్ కంపెనీ ప్రమాదంలో మరో కార్మికుడి మృతి
[ 28-03-2024]
సెజ్ సింబయో కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!