యువతకు ఆదర్శం భగత్సింగ్
దేశాన్ని దాస్య సంకెళ్ల నుంచి విముక్తికోసం ఉరి కంబాన్ని ముద్దాడిన అమరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను యువత ఆదర్శంగా తీసుకోవాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు నాయక్, రామకృష్ణ అన్నారు.
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నివాళులు అర్పిస్తున్న ప్రిన్సిపాళ్లు నాయక్, రామకృష్ణ, సిబ్బంది
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: దేశాన్ని దాస్య సంకెళ్ల నుంచి విముక్తికోసం ఉరి కంబాన్ని ముద్దాడిన అమరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను యువత ఆదర్శంగా తీసుకోవాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు నాయక్, రామకృష్ణ అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్, చరిత్ర విభాగాల ఆధ్వర్యంలో అమరుల త్యాగాలను స్మరిస్తూ వారి వర్ధంతిని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ పీఓలు విజయలక్ష్మి, నాగబాబు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. భగత్సింగ్ వర్థంతిని అరకులోయ గిరిజన సంఘం కార్యాలయంలో గిరిజన సంఘం, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరుల స్ఫూర్తితో గిరిజన హక్కులకై యువత నినదించాలని గిరిజనసంఘం, సీఐటీయూ నాయకులు ఉమామహేశ్వరరావు, బాలదేవ్ అన్నారు.
మోతుగూడెం, ఎటపాక, న్యూస్టుడే: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్ అన్నారు. చింతూరు మండలం గూడూరు పంచాయతీ గూడూరు, గొడ్లగూడెం, దేవరపల్లి, అల్లిగూడెంల్లో గురువారం భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ వర్ధంతిని నిర్వహించారు. పొడియ అక్ష్మణ్, రమేష్, శేషు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, రఘు, జ్యోతి, భీమయ్య, రాధిక, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎటపాక మండలంలో సీపీఎం మండల అధ్యక్షుడు ఇసంపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు. ఆకిశెట్టి రాము, ఆయా పార్టీ శాఖల సభ్యులు పాల్గొన్నారు.
కూనవరం, న్యూస్టుడే: భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు దేశం మెచ్చిన నాయకులని సీపీఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆ నాయకుల వర్ధంతి సభ నిర్వహించి వారి సేవలను కొనియాడారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.
చింతపల్లి గ్రామీణం: స్థానిక పభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి నిర్వహించారు. సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జిల్లా ఉపాధ్యక్షుడు జీవన్కృష్ణ, నాయకులు కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు, న్యూస్టుడే: ముంచంగిపుట్టు గిరిజన సంఘం కార్యాలయంలో సీపీఎం, గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు, మహిళా సంఘం ప్రతినిధులు భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ సంఘాల నేతలు శ్రీను, భీమరాజు, వరహాలుబాబు, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్