మెదడు మధించి.. మదిని గెలిచి!
రేపటి పౌరులుగా ఎదుగుతున్న నేటి పిల్లల్లో మనస్తత్వం అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని 139 పాఠశాలల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.
రాష్ట్రస్థాయికి రెండు నమూనాల ఎంపిక
- నర్సీపట్నం గ్రామీణం, న్యూస్టుడే
రేపటి పౌరులుగా ఎదుగుతున్న నేటి పిల్లల్లో మనస్తత్వం అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని 139 పాఠశాలల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.
పిల్లల భవిష్యత్తుకు ఊతమిచ్చేలా రూపుదిద్దుకున్న 403 ప్రాజెక్టులు ఈ నెల 20న అనకాపల్లిలో ప్రదర్శనకు ఉంచగా.. వాటిలో పది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.
...వీటిలో నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, పాయకరావుపేట హైస్కూళ్ల నమూనాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. 215 మంది గైడ్ టీచర్ల మార్గదర్శకంలో 13,151 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ నమూనాల తయారీలో భాగస్వామమయ్యారు.
రాష్ట్రస్థాయి ప్రదర్శన ఈ నెల 28న విజయవాడలో జరగనుంది.
ఎంపికైన ప్రాజెక్టులు ఇలా..
నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు నీలం గీతిక, కలిమి బుజ్జి, నవర జస్వంత్ పారిశుద్ధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని ‘ఆరోగ్య రాయబారి కవచం’ తయారు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు సాధారణంగా దుర్గంధభరితమైన పరిసరాల్లో పనిచేస్తుంటారు. దుర్గంధం భరించేందుకు కొందరు గుట్కా, ఖైనీ, మద్యానికి అలవాటు పడుతుంటారు. సురక్షితంగా ఉండేందుకు ఎన్-95 మాస్క్ వాడాలంటే మార్కెట్లో రూ.60 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయాలి. ఇంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితి వీరికి లేనందున సాధారణ మాస్కులకే క్రిములను ఎదుర్కొనే వేపనూనె, సువాసన ఇచ్చే నిమ్మగడ్డి ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే రక్షణ పొందవచ్చంటూ నమూనా తయారు చేశారు. గైడ్ టీచర్గా ఏవీ రాజగోపాల్ వ్యవహరించారు. కేవలం రూ.48 ఖర్చుతో వంద మి.లీ. ద్రావణాన్ని వీరు తయారు చేసి వినియోగించారు. దీన్ని అనేక మాస్క్లపై పిచికారీ చేసుకోవచ్చు.
పాయకరావుపేట విద్యార్థులను అభినందిస్తున్న అధికారులు
వాహన చోదకులను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేయడానికి వీలుగా ‘అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్’ పేరిట పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.దుర్గాప్రసాద్, కె.దుర్గాస్వామి సాధారణ కళ్లద్దాలను ఆధునికీకరించారు. గైడ్ టీచర్గా ఎ.దొరబాబు వ్యవహరించారు. 2021లో దేశంలో 4,12,482 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించడం, 3,84,448 మంది గాయపడటం ఈ బృందం పరిగణనలోకి తీసుకుంది. ఎక్కువ ప్రమాదాలు డ్రైవర్లు అలసట, పరధ్యానం, అతివేగం కారణంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాల్లో మరణించే వారిలో 67 శాతం మంది 18-45 సంవత్సరాల మధ్య వయసు వారే కావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో నిద్రమత్తు అధిగమించేలా, డ్రైవర్లను అప్రమత్తం చేసే పరికరాలు ధరలు రూ.25 వేల వరకు ఉన్నాయి. దీంతో వీరు తక్కువ ఖర్చుతో పరికరాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. బజర్, వైబ్రేటర్, మెర్కురీ, బ్యాటరీ తదితరాలను వినియోగించి సాధారణ కళ్లద్దాలను అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్గా అభివృద్ధి చేశారు. ఈ కళ్లద్దాలకు రూ.150 మాత్రమే ఖర్చవుతుందని గైడ్ టీచర్ దొరబాబు పేర్కొన్నారు.
ఆరోగ్య రాయబారి కవచం తయారు చేసిన చెట్టుపల్లి విద్యార్థులు
భవిష్యత్తుకు మార్గదర్శిగా.. : విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్తత్వం అభివృద్ధి చేయాలన్నది ఉన్నతాధికారుల ఆదేశం. తదనుగుణంగా ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చార్టుల ద్వారా తమ ప్రాజెక్ట్ను వివరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఎక్స్పోలు విద్యార్థులను ఎంతగానో చైతన్యం చేస్తాయి. భవిష్యత్తులో రాణించేందుకు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి.
ఏవీ రాజగోపాల్, గైడ్ టీచర్, చెట్టుపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?