మన్యంపై మమకారం
కనీస వసతులకు దూరంగా బతుకుతున్న గిరిజనులకు కావాల్సిన సదుపాయాలు కల్పనకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేసింది.
చింతూరు, న్యూస్టుడే
చింతూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కుర్చీలు
కనీస వసతులకు దూరంగా బతుకుతున్న గిరిజనులకు కావాల్సిన సదుపాయాలు కల్పనకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేసింది. మన్యంపై మమకారంతో రూ.లక్షలు వెచ్చించి ఆసుపత్రులు, పాఠశాలల్లో వసతుల కల్పనకు తమ వంతు కృషి చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సమారిటన్స్ ఫర్ ది నేషన్ సంస్థ అందిస్తున్న సేవలు గిరిజనులకు ఊరటనిస్తున్నాయి. ఈ సంస్థ ఇటీవల చింతూరు ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి రూ. లక్షలు వెచ్చించింది. చింతూరు ఒడ్డులో, పావురులంకలోని పాఠశాలలకు అదనపు గదులు నిర్మించి విద్యార్థులకు వసతి కల్పించింది. ఇప్పటివరకు చింతూరు ఏరియా ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేసేందుకు సరైన సదుపాయం లేదు. గతంలో ఈ సంస్థ సీఈఓ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇక్కడి సమస్యలను గుర్తించి పలు రక్తపరీక్షలు చేసే అధునాతన పరికరాలు సమకూర్చారు. బయో కెమిస్ట్రీ ఎనలైజర్ ల్యాబ్ను అమర్చారు. కాలేయం పనితీరు, చక్కెర, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాధారణ రక్తపరీక్షలు చేసేందుకు సెల్ కౌంటర్ పరికరాన్ని ఏర్పాటుచేశారు. దీంతో సుమారు 12 రకాల రక్తపరీక్షలు చేయవచ్చు. రక్తకణాల శాతాన్ని, రక్త ఫలకికలను లెక్కించవచ్చు. అంతేకాకుండా రోగుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా రెండు షెడ్లు నిర్మించారు. రోగులు కూర్చునేందుకు 40 కుర్చీలు, మంచాలు ఏర్పాటు చేశారు. కొవిడ్ సమయంలో ఈ ప్రాంతంలో రోగుల కోసం 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచారు. మెడిసిన్ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.
పాఠశాలల పునః నిర్మాణం
మండలంలోని పలు పాఠశాలలకు అదనపు గదులు నిర్మించడంతోపాటు మరమ్మతులకు గురైన గదులను పునః నిర్మించారు. పావురులంక, గొడ్లగూడెం, చింతూరు శబరి ఒడ్డు పాఠశాలలను పునః నిర్మించారు.
వరద బాధితులకు..
గత ఏడాది ఆగస్టు నెలలో సంభవించిన వరదలతో నిరాశ్రయులైన బాధితులకు తమ వంతు సంస్థ చేయూత అందించింది. సుమారు 32 గ్రామాల్లోని బాధితులకు టార్పాలిన్లు, నిత్యావసర సరకులు, మందులు, సోలార్ దీపాలు అందించి ఆదుకున్నారు.
గిరిజనులకు మావంతు సహకారం
చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి గతంలో వచ్చినప్పుడు రోగులు వైద్యసేవల కోసం నిల్చుని ఉండాల్సిన పరిస్థితిని గమనించా. రక్త పరీక్షల సామగ్రి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న తెలుసుకున్నాను. సంస్థ తరఫున ఏదైనా చేయాలని సంకల్పించుకుని రూ. 6 లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించాం. రోగులు కూర్చునేందుకు కుర్చీలు, మంచాలు, రక్త పరీక్షలకు పరికరాలు సమకూర్చాం. గిరిజనులకు మా వంతు సహకారం అందిస్తున్నాం.
రామ్కుమార్, సీఈఓ, సమారిటన్స్ ఫర్ ది నేషన్ సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
రెండో రోజు నామినేషన్ల సందడి
[ 20-04-2024]
నామినేషన్ల స్వీకరణ రెండో రోజు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ తెలిపారు. -
అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 20-04-2024]
ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. -
కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
[ 20-04-2024]
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. -
సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
[ 20-04-2024]
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. -
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 20-04-2024]
కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి
[ 20-04-2024]
తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. -
ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం
[ 20-04-2024]
అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్ కూడలి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. -
ఏజెన్సీలో వేసవి తాపం
[ 20-04-2024]
మైదాన ప్రాంతాలకు దీటుగా ఈ సారి ఏజెన్సీ ప్రాంతంలోనూ వేసవి తాపం గట్టిగానే చూపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా ఏజెన్సీలో ప్రధాన కేంద్రాలైన పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
[ 20-04-2024]
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నిర్వాసితులను ముంచిన జగన్
[ 20-04-2024]
జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరు పట్టణంలో పర్యటించి అనేక హామీలు గుప్పించారు. -
పోక్సో కేసులో ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు
[ 20-04-2024]
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రిన్సిపల్ నాగసాయి నరసింహమూర్తికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు