చుట్టూ పెట్టెలు... మధ్యలో పాఠాలు
బాలురు ఓచోట.. బాలికలు మరోచోట విద్యాభ్యాసం. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న బాలురు. భవన నిర్మాణానికి కోట్లాది రూపాయలు కేటాయించి మూడేళ్లవుతున్నా నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
కొయ్యూరు, న్యూస్టుడే
గురుకుల పాఠశాలలో ఏకలవ్యకు కేటాయించిన భవనం
బాలురు ఓచోట.. బాలికలు మరోచోట విద్యాభ్యాసం. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న బాలురు. భవన నిర్మాణానికి కోట్లాది రూపాయలు కేటాయించి మూడేళ్లవుతున్నా నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాత్కాలికంగా మరో భవనం కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదీ కొయ్యూరులోని ఏకలవ్య పాఠశాల పరిస్థితి.
కార్పొరేట్ తరహా విద్య అందించే ఉద్దేశంతో ప్రభుత్వం మండలానికో ఏకలవ్య పాఠశాలను మంజూరు చేసింది. ఒకే ప్రాంతంలో బాలురు, బాలికలకు వేర్వేరు వసతిగృహాలు, ఇతర అన్ని వసతులు కల్పించేందుకు రూ.40 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసానికి సకల సదుపాయాలు కల్పించాల్సి ఉంది. కొయ్యూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 2020 ఏప్రిల్లో ఈ పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల భవన నిర్మాణానికి బాలారం పంచాయతీలో 18.90 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
* అప్పటి నుంచి నేటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గురుకుల పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్వహించే రెండు గదుల భవనాన్ని ఏకలవ్యకు కేటాయించారు. 2022 ఆగస్టులో ఏకలవ్యకు శాశ్వత ప్రిన్సిపల్ రావడంతో బడిని వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. రెండు గదుల్లో బాలురకు ఆరు, ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరో తరగతిలో 30 మంది, ఏడులో 25 మంది చదువుతున్నారు. వీరంతా ఇరుకు గదుల్లో చుట్టూ పెట్టెల మధ్యలో చదువుకొంటున్నారు. బాలికలు ఆరు, ఏడు తరగతులు కలిపి 60 మంది చింతపల్లి ఏకలవ్యలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో తరగతి పెరగనుంది. ఇప్పుడే ఇరుకు గదుల్లో బడి కొనసాగుతోందని, మరో తరగతిని ఎక్కడ నిర్వహించాలా అని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
పెట్టెల మధ్యలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు
తాత్కాలిక భవనానికి వెతుకులాట
శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకు తాత్కాలికంగా వేరేచోట నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ ఉన్నతాధికారులను కోరారు. గతేడాది నవంబర్లో దీనిపై స్పందించిన గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు, నోడల్ ప్రిన్సిపల్, గురుకుల ఓఎస్డీలతో కలిసి మండ లానికి వచ్చారు. ఎంపీపీ రమేష్, ఏటీడబ్ల్యూవోలతో కలిసి గతంలో ఎంపీడీవో కార్యాలయంగా నిర్వహించే భవనాన్ని, కాకరపాడులోని బాలికల పోస్ట్మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయ పాత భవనం ఓ గదిలో ఎంఈవో కార్యాలయం, మరో గదిలో ఆధార్ కేంద్రం నడుస్తుండటంతో అది సరిపోదు.
* బాలికల పోస్ట్మెట్రిక్ వసతిగృహంలో సరిపడా గదులున్నా.. బాలురు ఉంటారు కాబట్టి స్నానాలు, మరుగుదొడ్లకు ఇబ్బంది అవుతుందని భావించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఇరుకు గదుల్లోనే ఇబ్బందులు పడుతూనే పాఠశాల కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న రాజవొమ్మంగి మండలంలో శాశ్వత భవన నిర్మాణం పూర్తవడం, అందులోకి విద్యార్థులు వెళ్లిపోవడం జరిగిపోయింది.
* కొయ్యూరులో మాత్రం కనీసం నిర్మాణ పనులే ప్రారంభం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకుంటే కనీసం నిర్మాణ పనులైనా ప్రారంభమయ్యేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ దృష్టిసారించి ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.