‘ఆదివాసులకు ప్రభుత్వం వెన్నుపోటు’
బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా గిరిజనులు ఆందోళనబాట పట్టారు.
జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్కు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ ఉద్యమ జేఏసీ నాయకులు రామారావుదొర, శేషాద్రి, గంగులయ్య తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్టుడే: బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా గిరిజనులు ఆందోళనబాట పట్టారు. ఆదివాసీ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఆదివాసీ ఉద్యమ జేఏసీ నేతలు సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ సతీష్కుమార్లకు వినతిపత్రాలు అందించారు. జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ వాటిని ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు యత్నిస్తోందన్నారు. అశాస్త్రీయ పద్ధతిలో శాసనసభలో తీర్మానం చేసి ఆదివాసులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. తక్షణమే ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హింసకు తావు లేకుండా బంద్ పాటించాలని ఎస్పీ సూచించారు. ఆదివాసీ ఉద్యమ జేఏసీ నాయకులు రామారావుదొర, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు శేషాద్రి, సింహాచలం, ప్రసాద్రావు, జనసేన అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి గంగులయ్య, తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, భాజపా నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, కృష్ణారావు, గురుస్వామి, గంగరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు సుమన్, ఆనంద్, అనిల్, మాధవ్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!