సింహాచలంలో ‘ప్రసాద్’ పథకం పనులకు శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన ‘ప్రసాద్’ పథకంలో భాగంగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని రూ.54.04 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరలోనే.
సమావేశంలో మంత్రి రోజా, ఎమ్మెల్సీ కల్యాణి తదితరులు
సింహాచలం, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన ‘ప్రసాద్’ పథకంలో భాగంగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని రూ.54.04 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే.రోజా వెల్లడించారు. మంగళవారం ఆమె సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రసాద్’ పథకంలో చేపట్టనున్న పనులకు సంబంధించి తుది డీపీఆర్ ఆమోదం పొందినట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులను ప్రారంభిస్తామన్నారు. సింహగిరి మెట్ల మార్గాన్ని విస్తరించి వెయ్యికి పైగా మెట్లతో అభివృద్ధి చేయడంతో పాటు అన్నప్రసాద భవనంలోని వంటశాలను యాంత్రీకరణ చేస్తామన్నారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు ఆరు విద్యుత్తు కార్లను ఏర్పాటు చేసి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, ట్రస్టీలు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని