logo

మొరాయించిన ఆర్టీసీ బస్సులు..

ఆర్టీసీ బస్సులు మొరాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.  రంపచోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం కొక్కిరాపల్లి ఘాట్‌ మార్గంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో మొరాయించింది.

Published : 29 Mar 2023 02:22 IST

కొక్కిరాపల్లి ఘాట్‌ మార్గంలో నిలిచిన బస్సు, వేచి ఉన్న ప్రయాణికులు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులు మొరాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.  రంపచోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం కొక్కిరాపల్లి ఘాట్‌ మార్గంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో మొరాయించింది. ఘాట్‌ మార్గంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. పాడేరు నుంచి మంప వెళుతున్న ఆర్టీసీ బస్సు కె.కోడాపల్లిలో నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులను కొంత సమయం తరవాత మరో బస్సులో పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు