జయజయ రామ.. జానకిరామా..!
పిన్న వయసులో రాక్షసులను మట్టుపెట్టాడు.. అన్యులకు సాధ్యంకాని శివ ధనస్సును ఒక్కపెట్టున ఎక్కుపెట్టాడు.. ఆయన పాదం తాకి రాయి అహల్యగా మారింది.
నేడే శ్రీరామనవమి
వరరామచంద్రాపురం, న్యూస్టుడే
పిన్న వయసులో రాక్షసులను మట్టుపెట్టాడు.. అన్యులకు సాధ్యంకాని శివ ధనస్సును ఒక్కపెట్టున ఎక్కుపెట్టాడు.. ఆయన పాదం తాకి రాయి
అహల్యగా మారింది.. పినతల్లి సూచన మేరకు అడవులకు వెళ్లమంటే మారుమాట్లాడకుండా కదిలాడు. ఒకటే భార్య, ఒకటే గురితప్పని బాణంగా జీవితమంతా ధర్మమార్గంలో సాగాడు. కనుకనే రాముడు దేవుడయ్యాడు, మానవాళి మనుగడకు ఆదర్శమూర్తిగా మారాడు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా జయజయ రామా.. జానకిరామ అంటూ భక్తులు ఆర్తి తీరా నామస్మరణ చేస్తున్నారు.
శ్రీరాముడి కల్యాణానికి జిల్లావ్యాప్తంగా భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామగిరి రామాలయంలో, గ్రామంలోని కల్యాణ మండపం, ప్రధాన ఆలయం చుట్టూ భక్తులకు నీడ కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు వాహనాల పార్కింగ్ స్థలం, బోట్ పాయిట్ ప్రాంతాన్ని పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయించారు. స్వామివారి వాహనాలకు రంగులు వేశారు. కొండపైకి ఉన్న మెట్ల మార్గం శుభ్రంచేయించి, అక్కడక్కడా నీడను ఏర్పాటు చేశారు.
సీతారాముల వనవాస కాలంలో ఈ ప్రాంతంలో గడపడం వల్లే భద్రాచలం, పర్ణశాల పరిసర ప్రాంతాలకు చారిత్రక గుర్తింపు వచ్చింది. భద్రాచలం అనుసంధానంగా ఉన్న ఈ ప్రాంతంలో వీఆర్పురం, ఎటపాక మండలాల్లో రామాయణ గుర్తులున్నట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.
* ఎటపాక మండలంలోని గుండాల ప్రాంతంలో సీత కోసం రాముడు బాణం ఇసుక తిన్నెలో సంధించగా.. వేడినీరు ఉబికి వచ్చిందని, ఆ నీటితో అమ్మవారు స్నానం చేశారని భక్తుల నమ్మకం. నవమికి భద్రాచలం వచ్చే భక్తులు గుండాల గోదావరి తీరంలోని ఆ ప్రాంతాన్ని దర్శించుకుని ఆ నీటిని తలపై చల్లుకుని వెళ్తారు.
* వీఆర్పురం మండలంలోని శ్రీరామగిరిపై రావణ సంహారం తరువాత రామ, లక్ష్మణులు దక్షిణముఖంగా వెలిశారు. దేశంలో ఇలా దక్షిణముఖంతో రామలక్ష్మణులు ఉన్న దేవాలయం మరెక్కడా లేదు. ఇక్కడ పూజలు చేసుకున్న భక్తులకు వారి పనుల్లో విజయం లభిస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది మంత్రులు పూజల్లో పాల్గొనేవారు. దశాబ్దం క్రితం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సీతారాములను దర్శించుకుని పూజలు చేశారు.
* వీఆర్పురం మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని దారపల్లిలో ఆదివాసీలు సుమారు 500 ఏళ్ల క్రితం నుంచి నాలుగు భారీ టేకు వృక్షాలకు దశరథుని సంతతిగా పూజలు చేస్తున్నారు. అప్పటినుంచి ఆ వృక్షాలకు హాని చేయరు. ఎవరైనా ఆ దిశగా ప్రయత్నంచేసినా ఊరుకోరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
నామినేషన్ల పర్వం నేటి నుంచి
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 18-04-2024]
శ్రీరామనవమి సందర్భంగా బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణంతో శ్రీరామ గిరులు తరించాయి. -
వైకాపా రెబల్గా వంతల రామన్న
[ 18-04-2024]
అరకులోయలో అసెంబ్లీ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు వైకాపా నాయకుడు వంతల రామన్న తెలిపారు. అరకులోయలో బుధవారం తన మద్దతుదారులు, వైకాపా నాయకులతో సమావేశం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 18-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
జానకి రాముల కల్యాణం.. జగమంతా సంబరం
[ 18-04-2024]
మాడుగుల గవర వీధిలో కొలువైన వైభోగ సీతారాముల కల్యాణోత్సవం బుధవారం రాత్రి ఆలయం ప్రాంగణంలో కనులపండువగా జరిగింది. -
కూటమికి మద్దతుగా వేల కి.మీ. బైకుపై ప్రచారం
[ 18-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని ప్రత్తిపాటి నాగ బాలాజీ బైక్పై రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ
[ 18-04-2024]
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. -
మద్యంతో పోలీసులకు చిక్కిన సూపర్వైజర్
[ 18-04-2024]
మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
ఎండలతో పర్యటక ప్రాంతాలు వెలవెల
[ 18-04-2024]
పర్యటక ప్రాంతం మారేడుమిల్లిలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా సుమారు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవడం గమనార్హం. -
బైకు అదుపుతప్పి ఆర్మీ ఉద్యోగి దుర్మరణం
[ 18-04-2024]
బైకు అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడిన ఘటనలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. చీడికాడ మండలం పెదగోగాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. -
అసౌకర్యాల అరకులోయ
[ 18-04-2024]
ఆంధ్రాఊటీ అరకులోయ పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఉంది. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు. -
నీటి పథకం మోటారుకు మరమ్మతులు
[ 18-04-2024]
మారేడుమిల్లిలోని పంపు హౌస్లో మోటార్కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నిర్మించిన మినీ ట్యాంక్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. -
ఆదివాసీ హక్కులను రక్షించే వారినే బలపర్చండి
[ 18-04-2024]
మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడలో ఇండియా కూటమిని గెలిపించాలని సీపీఎం నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. -
బెల్లం పులుపు ధ్వంసం
[ 18-04-2024]
పెదబొడ్డేపల్లి సమీపంలోని తోటల్లో నిల్వ ఉంచిన బెల్లం పులపును నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ధ్వంసం చేశారు. -
‘రాజీనామా చేయాలని వాలంటీర్లపై ఒత్తిడి’
[ 18-04-2024]
మండలంలో పనిచేస్తున్న వాలంటీర్లు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని సీపీఎం మండల కార్యదర్శి నాగులు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు