నీరు నీడా లేదు!
గరిష్ఠవేతనం కావాలంటే రెండు పూటలా పనికి వెళ్లాలంటున్నారు.. పరదాల్లేకపోవడంతో చెట్లనీడనే సేదతీరాలని సలహాలిస్తున్నారు.. పనిచేసే చోట ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంచడం లేదు.
పని ప్రదేశాల్లో కానరాని కనీస సదుపాయాలు
ఉపాధి వేతనదారుల పరిస్థితి దయనీయం
ఈనాడు డిజిటల్, పాడేరు - న్యూస్టుడే, పాడేరు
ఎండలో పనిచేస్తున్న కూలీలు
‘ఉపాధిహామీ పనికి వెళ్లే వేతనజీవులకు ఎండల నుంచి ఉపశమనం కోసం పరదాలు ఇచ్చేవారు..
పనిచేసే చోట ఏమైనా గాయాలైతే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో పెట్టేవారు.
వేసవిలో మజ్జిగ సరఫరా చేసేవారు..
మంచినీళ్లు తెచ్చుకున్నా..
పనిలో గునపం వినియోగించే కూలీలకు వారి
వేతనంలో కొంత మొత్తం కలిపేవారు.
ఎండ కాలం మొదలు అదనపు భత్యం ఇచ్చి ప్రోత్సహించేవారు’.
ఇదంతా రెండేళ్ల కిందటి మాట..
గరిష్ఠవేతనం కావాలంటే రెండు పూటలా పనికి వెళ్లాలంటున్నారు.. పరదాల్లేకపోవడంతో చెట్లనీడనే సేదతీరాలని సలహాలిస్తున్నారు.. పనిచేసే చోట ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంచడం లేదు. మజ్జిగ మాట అటుంచి మంచినీళ్ల సదుపాయం కూడా లేదు. గునపానికి డబ్బుల ఊసేలేదు.. వేసవి భత్యం కూడా కలవడం లేదు. మండుటెండలో పనిచేయలేక వేతనదారులు విలవిల్లాడిపోతున్నారు.
ఇదీ గతేడాది నుంచి ఉపాధి వేతనదారుల వెతలు
పనులు.. వేతనాలపైనా ప్రభావం
ఉపాధి పథకం అమలులో తీసుకువచ్చిన మార్పులు వేతనజీవులకు శరాఘాతంలా మారాయి. ఉమ్మడి జిల్లాలో 5.66 లక్షల మంది వేతనదారులున్నారు. వీరికి పని ప్రదేశాల వద్ద కనీస సదుపాయాలు కల్పించడం లేదు. గతేడాది వర్షాలు ఆలస్యంగా పడటంతో ఇప్పటికి చాలాచోట్ల చెరువుల్లో కొద్దిపాటి నీరు ఉంది. దీంతో సొంత గ్రామాల్లో పనులు అందుబాటులో లేక, దూరంగా ఇతర ప్రాంతాల్లో పనులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది దూరాభారం నడిచి వెళ్లి వస్తున్నారు. భగభగమండే ఎండల్లో గంటల తరబడి మట్టి పనులు చేయాల్సి రావడంతో శ్రమజీవులు అలసటకు గురవుతున్నారు. సేదతీరడానికి సమీపంలో ఎక్కడా నీడ లేక చెట్లు పుట్టలు చాటున గంజినీళ్లు తాగుతున్నారు. గతేడాది నుంచి వేసవి భత్యం కూడా కలపడం లేదు. ఫలితంగా వేతనదారులు గరిష్ఠ వేతనానికి దూరంగా నిలిచిపోవాల్సి వస్తోంది. రోజుకు రూ.257 వేతనం సంపాదించడానికి అవకాశం ఉన్నా రూ.200 మించి వేతనం అందుకోలేకపోతున్నారు.
సదుపాయాలు సున్నా..
‘ఉపాధి కూలీలకు టెంట్లు ఎప్పుడు సరఫరా చేస్తారు?, మండుటెండలో పని చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవికి ముందే ఏర్పాటు చేయాలి కదా.’ అంటూ ఫిబ్రవరిలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఓ జడ్పీటీసీ సభ్యుడు డ్వామా అధికారులను ప్రశ్నించారు. టెంట్ల సరఫరా కోసం టెండర్ పిలుస్తామని సమాధానమిచ్చిన అధికారులు మార్చి నెల ముగుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. గత కొన్నిరోజులుగా వేసవి ఎండలు మండిపోతున్నాయి. పనిచేసే చోట ప్రథమ చికిత్స కిట్ ఉన్నా లేకున్నా కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లయినా అందుబాటులో ఉంచాలి. అవి కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నీళ్ల సీసా అయిపోతే గొంతు తడుపుకోవడానికి గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అలాంటప్పుడు వడదెబ్బకు గరయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు.
ఎవరూ పట్టించుకోవడంలేదు: గతంలో పనికి వెళ్తే మజ్జిగ ఇచ్చేవారు, తాగునీటికి డబ్బులు చెల్లించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనిపై వీఆర్పీని అడిగితే అవేవీ ఇప్పుడు ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఎండగా ఉంది ఎక్కడైనా కూర్చుందామంటే నీడ కనబడటంలేదు. గంజినీళ్లు కూడా ఎండలోనే తాగాల్సి వస్తోంది. మున్ముందు ఎండలు మరింత పెరుగుతాయి. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఆర్.సత్యవతి, కె.సూర్యకాంతం
దెబ్బ తగిలితే ఆసుపత్రికే వెళ్లాలి: ఉపాధి పనికి మా గ్రామంనుంచి చాలా మంది ఎంతదూరమైనా నడిచే వెళుతున్నాం. పని ప్రాంతంలో ఎవరికైనా చిన్నచిన్న గాయాలైతే, గతంలో చికిత్స చేసుకోవడానికి కిట్ దగ్గరే ఉండేది. ఇప్పుడ ఆ కిట్లు ఏవీలేవు నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. పొట్టకూటికి పని చేసుకోవాలి కాబట్టి ఇబ్బందులు పడుతున్నా పనిలోకి వెళుతున్నాం.
యు.లక్ష్మి, కె.అమ్మాజీ
ప్రత్యేకంగా నిధులేమీ లేవు..: ఉపాధి కూలీల రక్షణ కోసం గతంలో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులుండేవి. పనిచేసే చోట నీడ కల్పించేందుకు టెంటుల ఏర్పాట్లు, మందుల కిట్లు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించేవాళ్లం. ప్రస్తుత వేసవి కాలంలో ఎండల నుంచి కూలీలు ఉపశమనం పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక నిధులేవీ రావడం లేదు. కూలీలకు ఈ ఖర్చులన్నీ కలిపి చెల్లిస్తున్నారు. మొన్నటివరకు ఒక్కో కూలీకి వేతనం రూ.257 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.15 మేర పెరిగింది.
రమేష్రామన్, డ్వామా పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం