కాలంతో పోటీ.. ఐఐఎంలో మేటి
విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (ఐఐఎం)లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే
స్నాతకోత్సవంలో ‘బంగారు పతకాల’ బహూకరణ
ఐఐఎం ఏడో స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు
విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (ఐఐఎం)లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు. ఇక్కడ నేర్చుకున్నవాటితో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటామని తెలిపారు. ఈ పతకాలు సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ ఐఐఎం ఏడో స్నాతకోత్సవం సందర్భంగా పీజీపీ, పీజీపీఎక్స్, పీజీపీడీజీఎం కోర్సుల్లో తొలి రెండు ర్యాంకులు, బెస్ట్ ఆల్రౌండ్, వాణిరావు మెమోరియల్ అవార్డు (అమ్మాయిల్లో తొలి ర్యాంకు) సాధించిన వారు బంగారు పతకాలు అందుకున్నారు. ఆ సంతోషాన్ని ‘ఈనాడు’తో పంచుకున్నారు.
కష్టపడితే సాధించగలం..
- అయాన్ వర్మ, పీజీపీ తొలి ర్యాంకు, బెస్ట్ ఆల్రౌండ్ పెర్ఫార్మర్
నా స్వస్థలం దిల్లీ. జర్నలిజం చదివాను. ఆ అనుభవమే మెరుగైన ఫలితాలు సాధించేలా నన్ను ముందుకు నడిపిస్తుంది. కొంచెం కష్టపడితే ఏదైనా సాధించగలం. రెండు బంగారు పతకాలు సాధిస్తానని ఊహించలేదు. నా కుటుంబంతోపాటు సమాజానికి మంచి చేయాలి. ఎప్పటికైనా అది సాధిస్తాను. విశాఖ అద్భుతమైన నగరం. విద్యాపరంగానే గాక పర్యాటక పరంగానూ ఆహ్లాదం కలిగించే ఈ ప్రాంతాన్ని అందరూ సందర్శించాలి.
వారి సహకారంతోనే..
- ప్రాప్తి అలోక్, పీజీపీ రెండో ర్యాంకు, వాణిరావు మెమోరియల్ అవార్డు గ్రహీత
మాది ఉత్తర్ప్రదేశ్లోని గజియాబాద్. రెండు బంగారు పతకాలు రావడం చాలా గర్వంగా ఉంది. ఇన్స్టిట్యూట్, ఆచార్యులు, బోధన సిబ్బంది సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీటెక్ తర్వాత రెండేళ్లు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశాను. ఉద్యోగం మానేసి ఉన్నత చదువులకు వెళ్తానంటే కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. విశాఖలో గడిపిన రెండేళ్ల కాలాన్ని మరచిపోలేను. ఐఐఎంలో డైరెక్టర్ నుంచి విద్యార్థి వరకు ఒకే కుటుంబంలా ఉన్నారు. భవిష్యత్తులో పీహెచ్డీ చేయాలని భావిస్తున్నాను.
స్టీల్ప్లాంట్లో పనిచేస్తూ..
- కునాల్ రంజన్, పీజీపీఎక్స్ తొలి ర్యాంకు
స్టీల్ప్లాంట్లో 2005 నుంచి పనిచేస్తున్నాను. సంస్థ సహకారం మరచిపోలేను. బంగారు పతకం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఉక్కు కర్మాగారం అభివృద్ధికి వీలైనంత కృషి చేస్తాను. భవిష్యత్తులో ఉన్నత చదువులకు వెళ్తాను. నేను సంపాదించిన జ్ఞానం, నేర్చుకున్న అంశాలు సమాజానికి ఉపయోగపడేలా పనిచేస్తాను. ముంబయి రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇక్కడ ఇంటర్వ్యూకు వచ్చాను. ఈ ప్రాంతం చాలా నచ్చడంతో అక్కడ ఉద్యోగం మానేసి స్టీల్ప్లాంట్లో చేరాను.
దేశానికి ఉపయోగ పడేలా
- మినాజ్ అహ్మద్, పీజీపీ డీజీఎం తొలి ర్యాంకు
మాది బిహార్లోని పట్నా. ప్రస్తుతం రక్షణ రంగం (డిఫెన్స్)లో విధులు నిర్వర్తిస్తున్నాను. బంగారు పతకం రావడం గర్వంగా ఉంది. కోర్సులో నేర్చుకున్న అంశాలతో దేశానికి మరింత మెరుగ్గా సేవ చేస్తాను. గతంలో పలుమార్లు విశాఖ వచ్చాను. అన్ని సమయాల్లోనూ ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తాను. ఇన్స్టిట్యూట్ స్థాపించిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ బోధన ఎంతో బాగుంది. కొత్తగా నిర్మిస్తున్న నూతన ప్రాంగణాన్ని ఇటీవల సందర్శించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు